అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోషేట్ ముందుగా వెల్లడించినట్టు, న్యూ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ట్రైనింగ్ సెషన్కు అభిషేక్ హాజరు కాలేదు. కడుపు సంబంధిత సమస్యలే దీనికి కారణమని అప్పుడే చెప్పాడు.
ఒక ప్రముఖ పత్రిక కథనం ప్రకారం, అభిషేక్ ఆరోగ్యం మరింత దిగజారడంతో వైద్యులు అతన్ని ఆసుపత్రిలో చేర్చి ఇంట్రావీనస్ డ్రిప్స్ ఇచ్చినట్లు సమాచారం. గత మ్యాచ్లో అమెరికాపై ఆడేటప్పుడు కూడా అతను అధిక జ్వరంతో బాధపడినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తర్వాత ధృవీకరించాడు.
భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ముందు ఫిట్నెస్ కీలకం
అమెరికాతో మ్యాచ్లో అభిషేక్ గోల్డెన్ డక్గా ఔటయ్యాడు. సుమారు 103 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్కు దిగినట్లు తెలుస్తోంది. ఔటైన తర్వాత మళ్లీ ఫీల్డింగ్కు రాకపోవడం ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలను పెంచింది. ఫిబ్రవరి 15న జరగనున్న భారత్–పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్ దృష్ట్యా, అతను పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడంపై జట్టు యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది.
మంగళవారం మాట్లాడిన రయాన్ టెన్ డోషేట్ పరిస్థితిపై సంక్షిప్తంగా వివరించాడు. “వాషింగ్టన్ నిన్న జట్టులో చేరాడు, ఇవాళ ట్రైనింగ్లో పాల్గొంటాడు. అభిషేక్కు ఇంకా కొన్ని టమ్మీ సమస్యలు ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం,” అని తెలిపాడు.
అభిషేక్ నమీబియా మ్యాచ్కు దూరమైతే, బ్యాటింగ్ కాంబినేషన్లో మార్పులు తప్పవు. సాంజూ శాంసన్ ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన నెట్ సెషన్లో అతను ఇషాన్ కిషన్తో కలిసి విస్తృతంగా ప్రాక్టీస్ చేశాడు. అవసరమైతే టాప్ ఆర్డర్లో కూడా అతను బాధ్యతలు చేపట్టగలడని జట్టు భావిస్తోంది.
ఇక ముందు మ్యాచ్ల్లో అభిషేక్ రీటర్న్పై స్పష్టత రానుండగా, అభిమానుల దృష్టి ఇప్పుడు అతని ఫిట్నెస్ అప్డేట్పైనే నిలిచింది.
అర్జున్–సానియా వివాహానికి ప్రధానిని ఆహ్వానించిన టెండుల్కర్ కుటుంబం
భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాడు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరిగే కీలక మ్యాచ్లో అతను ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ముందున్న కీలక మ్యాచ్ల నేపథ్యంలో ఇది జట్టుకు ఎదురుదెబ్బగా మారింది.