Asia Cup 2025 Controversy: Why India Is Yet to Receive the Trophy After Historic Win

ఆసియా కప్ 2025లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ట్రోఫీని గెలుచుకుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, టోర్నమెంట్ ముగిసి మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు భారత జట్టుకు అధికారికంగా ఆసియా కప్ ట్రోఫీ అందలేదు. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మరియు పాకిస్థాన్ హోం మంత్రి అయిన మొహ్సిన్ నఖ్వీ.
ఆసియా కప్ ఫైనల్ ఫలితం అయినా ట్రోఫీ మాత్రం లేదు
సెప్టెంబర్ 28, 2025న జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఈ టోర్నమెంట్లో పాకిస్థాన్ను వరుసగా మూడు సార్లు ఓడించి తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. సాధారణంగా ఏ జట్టు టోర్నమెంట్ గెలిచినా అదే రోజు ట్రోఫీ అందజేయడం ఆనవాయితీ. కానీ ఈసారి అది జరగలేదు.
సూర్యకుమార్ నిర్ణయంతో మొదలైన వివాదం
ఈ వివాదం మొదలవడానికి కారణం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న కీలక నిర్ణయం. పాకిస్థాన్ హోం మంత్రి హోదాలో ఉన్న మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి సూర్య నిరాకరించారు. ఈ నిర్ణయంతో తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన నఖ్వీ, ట్రోఫీని మైదానం నుంచి తీసుకుని వెళ్లిపోయాడనే ఆరోపణలు వినిపించాయి. అప్పటి నుంచి భారత్కు ట్రోఫీ అందకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం ఎక్కడ ఉంది
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ట్రోఫీ ఎక్కడ ఉందని ప్రశ్నించగా, మొహ్సిన్ నఖ్వీ “ట్రోఫీ సురక్షితంగా ఉంది” అని మాత్రమే సమాధానం ఇచ్చాడు. దీని ద్వారా భారత్కు ఇప్పటివరకు ట్రోఫీ అందలేదని స్పష్టమైంది. తాజా నివేదికల ప్రకారం, ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్లోని ఐసీసీ అకాడమీ కాంప్లెక్స్లో ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యాలయంలో కఠిన భద్రత మధ్య భద్రపరిచారు. ప్రత్యేక అనుమతి ఉన్న అధికారులు మాత్రమే ఆ ప్రదేశంలోకి ప్రవేశించగలరు.
భారత్కు ట్రోఫీ ఎప్పుడు అందుతుంది
బీసీసీఐ మరియు ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ మధ్య ఈ వివాదం ఇంకా పరిష్కార దశకు చేరలేదు. నఖ్వీ తన చేతుల మీదుగానే ట్రోఫీ ఇవ్వాలనే పట్టుదలతో ఉండగా, టీమ్ ఇండియా ఆ విధానానికి అంగీకరించడంలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. మరి ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు తన హక్కైన ట్రోఫీ ఎప్పుడు అందుతుందో వేచి చూడాల్సిందే.
మరిన్నివార్తలుచదవండి: సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం 138 ఏళ్ల తర్వాత...