BCB to Scrap A+ Category From 2026 Central Contracts Due to Lack of All-Format Players
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పురుష క్రికెటర్ల కోసం రూపొందించనున్న 2026 సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాలో ఏ–ప్లస్ గ్రేడ్ను తొలగించాలని నిర్ణయించింది. అన్ని ఫార్మాట్స్లో రెగ్యులర్గా ఆడుతున్న ఆల్-ఫార్మాట్ ప్లేయర్ ప్రస్తుతం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.
బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ కమిటీ మొత్తం 27 మంది క్రికెటర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను 2026 సెంట్రల్ కాంట్రాక్ట్స్లో చేర్చాలని భావిస్తున్నప్పటికీ, తుది ఆమోదం మాత్రం ఇంకా బోర్డు నుంచి రావాల్సి ఉంది. అయితే గత విధానానికి భిన్నంగా, ఈసారి ఏ–ప్లస్ గ్రేడ్ ఉండదని స్పష్టం చేసింది.
గత ఏడాది 2025లో బీసీబీ కాంట్రాక్ట్ స్ట్రక్చర్లో కీలక మార్పులు చేసింది. అప్పటివరకు టెస్ట్, వన్డే, టి20 ఫార్మాట్స్ ఆధారంగా ఉన్న ఒప్పందాలను తొలగించి, ఏ–ప్లస్, ఏ, బీ, సీ, డీ గ్రేడ్లుగా ప్లేయర్లను విభజించింది. అయితే ఇప్పుడు ఆ విధానంలో మరో మార్పు చేస్తూ అత్యున్నత ఏ–ప్లస్ గ్రేడ్ను పూర్తిగా తొలగిస్తోంది.
ఈ విషయంపై బీసీబీకి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, “ఈసారి సెంట్రల్ కాంట్రాక్ట్స్లో ఏ–ప్లస్ గ్రేడ్ ఉండదు. ప్రస్తుతం మా స్క్వాడ్లో మూడు ఫార్మాట్స్లోనూ కంటిన్యూస్గా ఆడుతున్న ప్లేయర్ లేడు. అదే ఆ గ్రేడ్కు ప్రధాన క్రైటీరియా. అందుకే 27 మంది ప్లేయర్ల జాబితాను సిద్ధం చేసి, బోర్డు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాం,” అని తెలిపారు.
2025 ఫిబ్రవరి వరకు సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న మహ్ముదుల్లా అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్ కావడంతో ఈసారి జాబితాలో చోటు దక్కలేదు. అయితే గత కాంట్రాక్ట్స్లో ఉన్న మిగతా 21 మంది ప్లేయర్లు మాత్రం కొత్త జాబితాలో కొనసాగారు. వారితో పాటు మరో ఆరు కొత్త పేర్లను కూడా బీసీబీ చేర్చింది. వారు – షమిమ్ హుస్సేన్ పట్వారీ, పర్వేజ్ హుస్సేన్ ఇమోన్, సైఫ్ హసన్, నయీమ్ హసన్, తన్వీర్ ఇస్లాం, హసన్ మురాద్.
2026 సెంట్రల్ కాంట్రాక్ట్స్కు పరిశీలనలో ఉన్న ప్లేయర్లు (సంభావ్య జాబితా):
నజ్ముల్ హుస్సేన్ షాంటో, లిట్టన్ కుమార్ దాస్, తస్కిన్ అహ్మద్, మెహదీ హసన్ మిరాజ్, ముష్ఫికుర్ రహీమ్, మొమినుల్ హక్, తైజుల్ ఇస్లాం, ముస్తఫిజూర్ రహ్మాన్, తౌహిద్ హృదోయ్, హసన్ మహ్ముద్, నాహిద్ రాణా, షాద్మన్ ఇస్లాం, సౌమ్య సర్కార్, జాకర్ అలీ అనిక్, తంజిద్ హసన్ తమీమ్, షోరిఫుల్ ఇస్లాం, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకిబ్, మహెదీ హసన్, నసుమ్ అహ్మద్, ఖాలెద్ అహ్మద్, షమిమ్ హుస్సేన్ పట్వారీ, పర్వేజ్ హుస్సేన్ ఇమోన్, సైఫ్ హసన్, నయీమ్ హసన్, తన్వీర్ ఇస్లాం, హసన్ మురాద్.
ఇదిలా ఉండగా, బీసీబీ మరో కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 5 నుంచి మూడు జట్లతో కూడిన ఓడోమ్మో బంగ్లాదేశ్ టి20 కప్ 2026ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ టి20 వరల్డ్ కప్కు అర్హత సాధించలేకపోయిన నేపథ్యంలో, దేశీయ స్థాయిలో ఈ ఫార్మాట్ను మరింత బలోపేతం చేయడమే ఈ టోర్నీ ప్రధాన లక్ష్యమని బోర్డు తెలిపింది.
ఈ టోర్నీలో పాల్గొనే జట్లు:
ధూమకేతు ఎలెవన్ – కెప్టెన్: లిట్టన్ దాస్
దుర్బార్ ఎలెవన్ – కెప్టెన్: నజ్ముల్ హుస్సేన్ షాంటో
దురోంటో ఎలెవన్ – కెప్టెన్: అక్బర్ అలీ
బీసీబీ ప్రకారం, ఈ టోర్నీలో ప్రైజ్ మనీ, మ్యాచ్ ఫీజులు కలిపి మొత్తం 2.5 కోట్ల టాకా వరకు ఇవ్వనున్నారు. “ఈ టోర్నీ కేవలం ఫ్రెండ్లీ గేమ్స్గా కాకుండా, పూర్తిస్థాయి కంపెటిటివ్ టోర్నమెంట్గా సాగాలనే ఉద్దేశంతో భారీ ప్రైజ్ మనీ ఏర్పాటు చేశాం,” అని బోర్డు అధికారి తెలిపారు.
ఈ టోర్నీలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను కూడా అమలు చేయనున్నారు. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో జరగనుండగా, ఫిబ్రవరి 9న ఫైనల్ నిర్వహించనున్నారు. అదేవిధంగా, టోర్నీకి ముందు ఫిబ్రవరి 1 నుంచి షేర్–ఎ–బంగ్లా నేషనల్ స్టేడియంలో ఫిట్నెస్ క్యాంప్ నిర్వహించే యోచనలో బీసీబీ ఉంది.
శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న తిలక్ వర్మ – బీసీసీఐ క్లియరెన్స్