Gautam Gambhir on Test Series Loss: “I Will Respect BCCI’s Decision”
దక్షిణాఫ్రికాతో జరుగిన టెస్ట్ సిరీస్లో ఎదురైన అవమానకర పరాజయం తరువాత తన భవిష్యత్తు గురించి బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలనీ, తాను ఆ నిర్ణయాన్ని గౌరవిస్తానని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ తెలిపారు. రెండు టెస్టుల్లోనూ ఓడిపోవడంతో 2-0తో స్ఫీతి కోల్పోయిన భారత జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"అది బీసీసీఐ నిర్ణయించేది. నేను మొదటిసారి ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇదే చెప్పాను. భారత క్రికెట్ ముఖ్యం, నేను కాదు. ఈరోజు కూడా అదే చెబుతున్నాను," అని మ్యాచ్ అనంతరం మీడియా గంభీర్ అన్నారు.
తనపై వస్తున్న విమర్శల మధ్య గంభీర్ గత విజయాలను కూడా గుర్తు చేశారు. “ఇంగ్లండ్లో యువ జట్టుతో ఫలితాలు సాధించినవాడినే నేను. మీలో చాలా మంది అది మరచిపోతున్నారు. న్యూజిలాండ్ మీద గెలిచి సిరీస్ వైట్వాష్ చేసిన జట్టే ఇది. అదే నేను ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియా కప్ గెలిపించిన కోచ్నీ కదా,” అని గంభీర్ గుర్తు చేశారు.
జట్టు వైఫల్యానికి సమిష్టి బాధ్యత తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. “పరాజయానికి అందరూ బాధ్యత వహించాలి, దాని మొదలు నేనే. 95/1 నుంచి 122/7కి కూలిపోవడం క్షమించే విషయం కాదు. ఎవరికో ఒకరిపై, ఏ ఒక్క షాట్పై తప్పు వేయడం సరికాదు. బాధ్యత అందరిదీ,” అన్నారు గంభీర్.
గంభీర్ నేతృత్వంలో భారత్ 18 టెస్టుల్లో 10 ఓటములు
గంభీర్ నాయకత్వంలో భారత్ ఇప్పటివరకు 18 టెస్టుల్లో 10 ఓటములు నమోదు చేసింది. న్యూజిలాండ్, ఇప్పుడు దక్షిణాఫ్రికా సిరీస్ వైట్వాష్లు జట్టుకు గట్టి షాక్లుగా నిలిచాయి. తరచూ జట్టులో మార్పులు చేయడం, ఆల్రౌండర్లకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి నిర్ణయాలపై కూడా ఆయనపై విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ, “రెడ్బాల్ క్రికెట్కి వైట్బాల్ క్రికెట్తో పోలిస్తే పూర్తిగా వేరే సవాళ్లు ఉంటాయి. దానికి కావలసిన నైపుణ్యం కూడా వేరు. అంతకన్నా ముఖ్యమైనది — ధైర్యం ఉన్న ఆటగాళ్లు కావాలి,” అన్నారు.
“అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవాళ్ళు కాకపోయినా పర్వాలేదు, ధైర్యం ఉన్న ఆటగాళ్లు ఏ పరిస్థితుల్లోనైనా ముందుకు సాగగలగాలి,” అని ఆయన జోడించారు.
స్పిన్పై భారత బ్యాటర్ల బలహీనత గురించి మాట్లాడిన గంభీర్, అది అనుభవలేమి కారణంగానే అని చెప్పారు. “టాప్-8లో ఉన్న ఐదుగురు బ్యాటర్లకు 15 టెస్టులు కూడా లేవు. వాళ్లు నేర్చుకుంటూ ఉన్నారు. టాప్ టీమ్ మీద టెస్టు ఆడడం సులభం కాదు, వారికి కొంత సమయం ఇవ్వాలి,” అన్నారు. న్యూజిలాండ్ సిరీస్తో పోలికలు తార్కికం కాదని ఆయన స్పష్టం చేశారు.
మొత్తానికి, ఈ జట్టులో మార్పులు జరుగుతున్నాయని గంభీర్ అంగీకరించారు. “అది నాకు నచ్చని పదం, ట్రాన్సిషన్. కానీ వాళ్లు కష్టపడుతున్నారు. అనుభవం తక్కువైనా, ఈ జట్టు పరిస్థితిని మార్చేందుకు తాము సాధ్యమైనంత చేస్తున్నారంటే అది నిజం,” అని గంభీర్ ముగించారు.