ICC Approves European T20 Premier League Abhishek Bachchan Among Partners

టీ20 క్రికెట్లో వేగంగా పెరుగుతున్న దేశవాళీ లీగ్ల జాబితాలో మరో కొత్త టోర్నీ చేరనుంది. ‘యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్’ అనే పేరుతో ఈ లీగ్ నిర్వహించబడనుంది. ఈ టోర్నీ నిర్వహణకు అంతర్జాతీయ క్రికెట్ మండలి అధికారికంగా అనుమతి ఇచ్చింది.
‘రూల్స్ గ్లోబల్’ అనే సంస్థతో కలిసి ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఈ లీగ్ను నిర్వహించనుంది. యూరప్లో క్రికెట్కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ లీగ్ను ప్రారంభిస్తున్నారు.
అభిషేక్ బచ్చన్ కూడా భాగస్వామి
ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్తో పాటు పలువురు వ్యాపారవేత్తలు రూల్స్ గ్లోబల్ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పటికే ఈ లీగ్కు సంబంధించి మూడు జట్ల కొనుగోలు పూర్తయ్యింది.
ఆమ్స్టర్డామ్ ఫ్రాంచైజీకి దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు మూడు ఒలింపిక్ పతకాలు సాధించిన మరియు రెండుసార్లు ప్రపంచకప్లు గెలిచిన ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం జేమీ డ్వేయర్ సహ యజమానిగా చేరడం విశేషం.
బెల్ఫాస్ట్ జట్టుకు గ్లెన్ మ్యాక్స్వెల్ యజమాని
ఎడిన్బర్గ్ జట్టును న్యూజిలాండ్ మాజీ క్రికెటర్లు నాథన్ మెకల్లమ్ మరియు కైల్ మిల్స్ కలిసి సొంతం చేసుకున్నారు. బెల్ఫాస్ట్ జట్టుకు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ యజమానిగా ఉన్నారు.
ఈ ఏడాది ఆగస్టులో ఈ లీగ్ ప్రారంభం కానుంది. ఇటీవలి కాలంలో యూరప్లో కూడా క్రికెట్కు మంచి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈటీపీఎల్ విజయవంతమవుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్నివార్తలుచదవండి: టీ20 క్రికెట్లో టీమిండియా చరిత్రాత్మక రికార్డు 44 సార్లు 200కు పైగా స్కోర్లు