IND vs SA: Jasprit Bumrah Loses Cool at Airport, Video Goes Viral

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎయిర్పోర్ట్లో ఒక అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో నెటిజన్ల మధ్య పెద్ద చర్చ మొదలైంది. సాధారణంగా ఎంతో ప్రశాంతంగా ఉండే బుమ్రా ఇలా స్పందించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ మైదానం వెలుపల జరిగిన ఈ ఘటన ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది.
అసలు ఏమైంది అంటే
ఎయిర్పోర్ట్లో బుమ్రా క్యూలో నిలబడి ఉన్న సమయంలో, పక్కనే ఉన్న ఒక అభిమాని అతని అనుమతి లేకుండానే సెల్ఫీ వీడియో తీయడం ప్రారంభించాడు. ఇది గమనించిన బుమ్రా మొదట చాలా శాంతంగా స్పందిస్తూ, వీడియో తీయవద్దని హెచ్చరించాడు.
“వీడియో తీయకండి. ఫోన్ కింద పడిపోతే దానికి నేను బాధ్యత తీసుకోను” అని స్పష్టంగా చెప్పాడు.
హెచ్చరికను పట్టించుకోని అభిమాని
బుమ్రా హెచ్చరించినప్పటికీ ఆ అభిమాని వీడియో తీయడం ఆపలేదు. పైగా “పర్వాలేదు సార్” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో సహనం కోల్పోయిన బుమ్రా ఒక్కసారిగా ఆ అభిమాని చేతిలోని ఫోన్ను లాక్కున్నాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్నవారి కెమెరాల్లో రికార్డు కావడంతో, వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది.
వీడియోలో వినిపించిన సంభాషణ
అభిమాని: సార్, మీతోనే వస్తాను
బుమ్రా: నీ ఫోన్ కింద పడిపోతే నన్ను అడగకు
అభిమాని: పర్వాలేదు సార్
బుమ్రా: అవునా, అయితే సరే అని చెప్పి వెంటనే ఫోన్ లాక్కున్నారు
What an arrogant behavior by Jasprit Bumrah. First he threatened his fan that he would throw his phone, and later he snatched the fan's phone. pic.twitter.com/O2e4jSLw7s
— 𝐆𝐨𝐚𝐭𝐥𝐢𝐟𝐢𝐞𝐝 👑 (@Goatlified) December 17, 2025
సోషల్ మీడియాలో స్పందన
ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు బుమ్రా ప్రవర్తనను తప్పుబడుతూ “ఇంత అహంకారం అవసరమా” అంటూ విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం “అనుమతి లేకుండా వీడియో తీయడం తప్పు. ప్రైవసీని గౌరవించని అభిమానులకు బుమ్రా సరైన గుణపాఠం చెప్పారు” అంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఎప్పుడూ కూల్గా కనిపించే బుమ్రా ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
టీ20 సిరీస్లో బుమ్రా ప్రదర్శన
జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీం ఇండియా టీ20 సిరీస్లో భాగంగా ఉన్నాడు. కటక్లో జరిగిన తొలి టీ20లో అతను రెండు వికెట్లు పడగొట్టాడు. ముల్లన్పూర్లో జరిగిన రెండో టీ20లో వికెట్ తీయలేకపోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల ధర్మశాలలో జరిగిన మూడో టీ20కు బుమ్రా దూరమయ్యాడు. లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ సిరీస్లో ఐదో మరియు చివరి టీ20 డిసెంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
మరిన్ని వార్తలు చదవండి: విరాట్ కోహ్లీపై నెటిజన్ల ఫైర్: ఇదేమి సంస్కారం? అంటూ ట్రోలింగ్