IPL

India vs South Africa 2nd ODI: Bavuma Press Conference & Past Records

by Guna SRV

భారత్‌తో రెండో వన్డేకు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా కీలక వ్యాఖ్యలు చేశాడు. విశ్రాంతి కారణంగా తొలి వన్డేకు అందుబాటులో లేకపోయిన బవూమా, రెండో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చేరికతో భారత జట్టు మరింత బలపడిందని ఆయన పేర్కొన్నాడు. తొలి వన్డేలో విజయం సాధించడంలో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల అనుభవం భారత్‌కు పెద్ద ప్లస్ అయిందని చెప్పాడు.

అలాగే రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ—
"రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాకతో టీమిండియా దాడి మరింత పెరిగింది. అయితే వీరిద్దరినీ ఎదుర్కోవడం మాకు కొత్త అనుభవం కాదు. పలు సందర్భాల్లో మేము కూడా పైచేయి సాధించాం. ఇలాంటి పోటీ కారణంగా సిరీస్ మరింత రసవత్తరంగా మారుతుంది" అని బవూమా అన్నారు.

చర్చలో భాగంగా రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు. “ఆప్పుడు నేను ఇప్పుడే స్కూల్‌లో చదువుతున్నా. రోహిత్ శర్మ అప్పటికే ప్రపంచకప్ ఆడుతున్నాడు” అని చెప్పుకొచ్చాడు.
తెలిసిందే… 2007 తొలి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆ జట్టులో రోహిత్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు.

ఇక సిరీస్ విషయానికి వస్తే, భారత్–దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే బుధవారం రాయ్‌పూర్‌లో జరుగుతోంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం అవుతుంది. తొలి వన్డేలో గెలిచి భారత్ ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో శతకంతో మెరిసిన విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు.

రెండో వన్డేలో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

రెండో వన్డేకు భారత తుది జట్టు అంచనా:

  • రోహిత్ శర్మ

  • యశస్వి జైస్వాల్

  • విరాట్ కోహ్లీ

  • రిషభ్ పంత్

  • కేఎల్ రాహుల్ (కెప్టెన్)

  • నితీశ్ కుమార్ రెడ్డి

  • రవీంద్ర జడేజా

  • హర్షిత్ రాణా

  • కుల్దీప్ యాదవ్

  • అర్ష్‌దీప్ సింగ్

  • ప్రసిద్ధ్ కృష్ణ

రాయ్పుర్ వేదికలో జరిగే మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా నిర్ధారించింది. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు ఒకే వన్డే మ్యాచ్ ఆడి ఘన విజయం సాధించింది.

మరిన్ని వార్తలు చదవండి: SMAT 2025: అర్జున్ టెండూల్కర్ మూడు వికెట్లతో ధాటిగా – గోవా ఘన విజయం