IPL

India Women vs Sri Lanka Women 2nd T20I 2025: Shafali Verma Leads Team India to 7-Wicket Win

by Guna SRV

భారత్ మహిళల జట్టు శ్రీలంక మహిళల జట్లతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి, సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో యువ విధ్వంసక బ్యాటర్ షఫాలీ వర్మ తన తుఫాను ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించింది.

మ్యాచ్ సారాంశం

రెండో మ్యాచ్ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరిగింది. తడబడ్డ లంక తుది 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. శ్రీలంకా కేప్టెన్ చమరి 31, హర్షిత సమరవిక్రమ్ 33 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ప్రదర్శన కనబరిచలేకపోయారు.

భారత బౌలర్లలో వైష్ణవి శర్మ (2/31), శ్రీ చరణి (2/23) రెండు వికెట్లు తీయగా, స్నేహ్ రాణా (1/11) మరియు క్రాంతి గౌడ్ (1/21) మితమైన బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టారు.

షఫాలీ వర్మ తుఫాను

భారత్ 129 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగినపుడు, ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు ఆరంభం ఇచ్చింది. కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన షఫాలీ, శ్రీలంక బౌలర్లను పూర్తిగా ముప్పుతిప్పలు పెట్టింది.

ఓపెనర్ స్మృతి మంధాన 14 పరుగులలో అవుట్ అయినప్పటికీ, షఫాలీ మరియు జెమిమా రోడ్రిగ్స్ అందించిన వేగం వల్ల భారత్ కేవలం 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి విజయం సాధించింది. షఫాలీ వర్మ 34 బంతుల్లో 69 రన్స్ సిక్స్ మరియు 11 ఫోర్లతో అజేయంగా నిలిచింది. జెమిమా 26, హర్మన్‌ప్రీత్ కౌర్ 10, మంధాన 14 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

సిరీస్ అప్‌డేట్

ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. వరుసగా రెండు విజయాలతో టీమ్ ఇండియా మంచి ఊపులో ఉంది. మూడవ టీ20 మ్యాచ్ డిసెంబర్ 26న తిరువనంతపురంలో జరగనుంది.

భారత్ తుది జట్టు:

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, శ్రీ చరణి

మరిన్ని వార్తలు చదవండి: కోహ్లీ, రోహిత్ సరసన జడేజా… విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న ఆల్‌రౌండర్