IPL 2026 Final Shift Likely? Ticket Controversy Clouds Bengaluru Chances
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ సమయం దగ్గరపడుతున్నప్పటికీ, ఫైనల్ మ్యాచ్ వేదికపై ఇంకా స్పష్టత రాలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. కార్యదర్శి దేవజిత్ సైకియా త్వరలో అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు. అయితే బెంగళూరులో జరుగుతున్న క్రికెట్ేతర వివాదం ఈ నిర్ణయాన్ని క్లిష్టం చేసింది.
ముందుగా బీసీసీఐ కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలను ప్లేఆఫ్స్ వేదికలుగా ఎంపిక చేసింది. సంప్రదాయం ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు ఫైనల్ ఆతిథ్యం ఇవ్వాలి. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ హోం గ్రౌండ్ ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ నిర్వహించే అవకాశం ఉంది. కానీ టికెట్ కేటాయింపులపై రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో పరిస్థితి అనిశ్చితంగా మారింది.
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ప్లేఆఫ్స్ మ్యాచ్లు పంజాబ్, కర్ణాటక మధ్య విభజించే అవకాశం ఉంది. అయితే సంప్రదాయం ప్రకారం ఫైనల్ బెంగళూరులో జరగాల్సి ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే టికెట్ సమస్య కారణంగా ఆ నిర్ణయం మారవచ్చు. సమస్య పరిష్కారం కాకపోతే ఫైనల్ను మరో నగరానికి మార్చే అవకాశముంది.
ఎమ్మెల్యేల ఉచిత టికెట్ డిమాండ్తో చెలరేగిన వివాదం
ఈ వివాదానికి కారణం కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కశప్పనవర్ చేసిన డిమాండ్. ప్రజాప్రతినిధులకు ఉచిత టికెట్లు ఇవ్వాలని, వారు సాధారణ అభిమానుల్లా క్యూలో నిలబడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. పలువురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి కనీసం ఐదు టికెట్లు ఇవ్వాలని కోరారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కూడా విమర్శలకు గురైంది.
ఈ అంశంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి. కె. శివకుమార్ జోక్యం చేసుకున్నారు. చివరికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు తలో మూడు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే హోం మంత్రి జి. పరమేశ్వర ఈ టికెట్లు ఇతరులకు బదిలీ చేయరాదని స్పష్టం చేశారు.
అయినా కూడా ఈ వివాదం అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. టికెట్లు ఖరీదుగా ఉన్న సమయంలో కల్చర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది నేతలు ఉచిత టికెట్లు తిరస్కరించినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. సజావుగా మ్యాచ్ నిర్వహణ, భద్రత దృష్ట్యా పరిస్థితి మారకపోతే బీసీసీఐ ఫైనల్ను బెంగళూరు నుంచి మార్చే అవకాశం ఉంది.
IPL 2026 ప్లేఆఫ్స్ రేస్: ఎవరు దగ్గర, ఎవరు ఔట్? పూర్తి విశ్లేషణ