Remove Suryakumar as Captain… He Is the Right Choice: Ganguly’s Big Statement

భారత పురుషుల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ను నియమించే దిశగా బీసీసీఐ ఆలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టులు, వన్డేల్లో శుభ్మన్ గిల్ జట్టును నడిపిస్తుండగా, టీ20 ఫార్మాట్కి సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు.
ఈ ఏడాది మేలో రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ బాధ్యతలు గిల్కు అప్పగించబడ్డాయి. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వన్డే జట్టు నాయకత్వం కూడా గిల్కే ఇవ్వగా, టీ20ల్లో సూర్యకు డిప్యూటీగా గిల్ను ఎంపిక చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో టీ20ల్లో కూడా గిల్కే సారథ్యం అప్పగించే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. టీ20 ప్రపంచకప్ 2024 విజయం తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో, అతడి స్థానంలో హార్దిక్ పాండ్యా లేదా జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ అవుతారని చాలామంది భావించారు. అయితే బీసీసీఐ ఆశ్చర్యంగా ఆ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్కు అప్పగించింది.
సూర్యను కెప్టెన్గా నియమించడాన్ని కొందరు విమర్శించినప్పటికీ, అతడు తన అద్భుత నాయకత్వంతో అందరినీ ఆకట్టుకున్నాడు. సూర్య నేతృత్వంలో భారత్ ఆడిన 22 టీ20 మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే ఓడిపోవడం అతడి కెప్టెన్సీ నైపుణ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
అయినా టీ20ల్లో కూడా గిల్కు సారథ్యం ఇవ్వాలని క్రికెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ అభిప్రాయాన్ని తాజాగా మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా సమర్థించాడు. మూడు ఫార్మాట్లలో గిల్ను కెప్టెన్గా నియమించడానికే తాను మద్దతు ఇస్తానని గంగూలీ చెప్పాడు.
సౌతాఫ్రికా టెస్టు సందర్భంగా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఒక సంభాషణను గుర్తుచేసుకున్న దాదా ఇలా అన్నాడు:
“శుభ్మన్ గిల్ టీ20ల్లో కూడా కెప్టెన్గా ఉండాలని అనుకుంటున్నారా?” అని ఎవరో నన్ను అడిగారు. నేను వెంటనే ‘అవును’ అన్నాను. గిల్కు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఏ ఫార్మాట్లోనైనా జట్టును నడిపించగల సామర్థ్యం అతడికి ఉంది. మూడు నెలల క్రితం ఇంగ్లండ్లో అతడు చేసిన ప్రదర్శన అందరికీ తెలిసిందే. రోహిత్ శర్మ, కోహ్లీ లేని సమయంలో కూడా బ్యాటింగ్, కెప్టెన్సీతో అదరగొట్టాడు,” అని గంగూలీ ‘Captain’s Call’ పోడ్కాస్ట్లో పేర్కొన్నాడు.
మరిన్ని వార్తలు చదవండి: విరాట్ కోహ్లీ 100 సెంచరీలు: సునీల్ గవాస్కర్ అంచనాలు, 2027 వరల్డ్ కప్ తర్వాత సాకారం