Sai Sudharsan Injured in Vijay Hazare Trophy, Set to Recover for IPL 2026

మైదానంలో తీవ్రంగా గాయపడి, నెలల పాటు ఆటకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఘటన మరవకముందే మరో టీమిండియా యువ స్టార్ గాయపడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా మధ్యప్రదేశ్తో ఇటీవల జరిగిన మ్యాచ్లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా యువ స్టార్ సాయి సుదర్శన్ పక్కటెముక విరగింది.
రన్ పూర్తి చేయడానికి డైవ్ చేస్తున్న సమయంలో సుదర్శన్ ప్రమాదకరంగా కింద పడాడు. ఆ సమయంలో గాయం పెద్దదిగా అనిపించకపోయినా, స్కానింగ్లో రిబ్ ఫ్రాక్చర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటన కొన్ని రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.
ఈ గాయం కారణంగా సాయి విజయ్ హజారే ట్రోఫీలో తదుపరి మ్యాచ్లకు దూరం కానున్నాడు. వైద్యుల సూచన ప్రకారం అతనికి 6-8 వారాలు విశ్రాంతి అవసరం. ప్రస్తుతం సాయి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందుతున్నాడు.
సాయి ఐపీఎల్ 2026 ప్రారంభానికి పూర్తిగా కోలుకునే అవకాశముంది. అతను గుజరాత్ టైటాన్స్లో కీలక ఆటగాడు. గత కొన్ని సీజన్లుగా టైటాన్స్ తరపున స్థిరమైన ప్రదర్శన చూపిస్తున్నాడు.
ఇంకా, సాయి ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భారత టెస్ట్ జట్టులో వరుస అవకాశాలు పొందాడు. అయితే వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతని తదుపరి టీమిండియా అవకాశాలు ఐపీఎల్ 2026లోని ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి.
24 ఏళ్ల సాయి టీమిండియా తరపున 6 టెస్ట్లలో 2 అర్ధసెంచరీలతో 302 పరుగులు సాధించాడు. 3 వన్డేల్లో 2 అర్ధసెంచరీలతో 127 పరుగులు చేశాడు.
ఐపీఎల్లో సాయికి ఘనమైన రికార్డు ఉంది. మొదటి మ్యాచ్ నుండి గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతూ, 40 మ్యాచ్లలో 145కి పైగా పందుల వేగం, 49.8 సగటు, 2 శతకాలు, 12 అర్ధశతకాలతో 1793 పరుగులు చేసిన సాయి, తన స్థిరమైన ప్రదర్శనతో టీమిండియాలో మరో అవకాశానికి సిద్ధంగా ఉన్నాడు.
మరిన్నివార్తలుచదవండి: BAN vs IND: ఆగస్టు సెప్టెంబర్లో బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన షెడ్యూల్ ఖరారు