Smriti Mandhana Marriage: Palash Muchhal’s Mother Breaks Silence on Wedding Delay

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వివాహం మరోసారి చర్చకు దారితీసింది. ఇటీవల సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో ఆమె పెళ్లి ఎందుకు వాయిదా పడింది? అనే ప్రశ్నపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతోంది. పలాష్ ముచ్చల్ తమను మోసం చేశాడనే ఆరోపణలే వివాహం నిరవధికంగా వాయిదా పడటానికి కారణమని కొన్ని పోస్టులు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, పలాష్తో చాట్ చేసిన వ్యక్తి తానేనని ఒక యువతి గురువారం వెల్లడించింది. స్మృతి తన ఆరాధ్య క్రికెటర్ అని, అలాంటి అమ్మాయికి పలాష్ నిజ స్వభావం తెలిసి ఉండాలని తన ఉద్దేశమని ఆమె చెప్పింది. అయితే, ఆ తరువాత ఆమె ఇచ్చిన ట్విస్టు ఏమిటంటే — పలాష్తో తనకు ఏ సంబంధమూ లేదని, ఆ చాట్స్ కూడా చాలా కాలం క్రిందివేనని ప్రకటించింది.
ఇక మరోవైపు, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పెళ్లి విషయమై ఏ స్పందన రాకపోవడం అనేక అనుమానాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో పలాష్ ముచ్చల్ తల్లి అమిత ముచ్చల్ మరోసారి మీడియాతో మాట్లాడారు.
“మానసిక వేదన వర్ణించలేనిది” – అమిత ముచ్చల్
అమిత ముచ్చల్ హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ—
“పెళ్లి జరగాల్సిన రోజు జరిగిన పరిస్థితులతో ఇద్దరూ తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఆ బాధ వర్ణించలేనిది. పలాష్ తన వధువుతో ఇంట్లో అడుగుపెట్టే రోజును ఎంతో ఆతృతగా ఎదురుచూశాడు. నేను కూడా కోడలికి ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశాను. త్వరలోనే అన్ని విషయాలు సర్దుకుంటాయి. త్వరలోనే పెళ్లి జరుగుతుంది” అని తెలిపారు.
అయితే, మంధాన కుటుంబం మాత్రం ఇప్పటికీ స్మృతి–పలాష్ల వివాహంపై ఏ విధమైన అధికారిక స్పందన ఇవ్వలేదు.
స్మృతి డిలీట్ చేసిన పెళ్లి వీడియోలు
పలాష్ తల్లి మరో ముఖ్యమైన విషయాన్ని కూడా వెల్లడించారు.
“స్మృతి తండ్రి అనారోగ్యం పాలవడం పలాష్ను చాలా కలిచివేసింది. ఆయనపై తన కుమారుడికి ఎంతో అభిమానముంది. ఆయన ఆరోగ్య సమస్య తట్టుకోలేక పలాష్ కూడా కుంగిపోయాడు. నిజానికి పెళ్లిని వాయిదా వేయాలని ముందుగా పలాషే చెప్పాడు” అని అమిత తెలిపారు.
ఇప్పటికే స్మృతి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో నుండి డిలీట్ చేయడం మరింత చర్చకు కారణమైంది.
మరిన్ని వార్తలు చదవండి: WPL 2026 మెగా వేలం: అన్క్యాప్డ్ భారత క్రికెటర్లపై భారీ డిమాండ్