Suryakumar Yadav Breaks Virat Kohli Record in T20 Cricket History

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఫిబ్రవరి 7న యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన సూర్యకుమార్, భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
విరాట్ కోహ్లీ 125 టీ20 మ్యాచ్ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకోగా, సూర్యకుమార్ యాదవ్ కేవలం 105 మ్యాచ్ల్లోనే 17 అవార్డులు సాధించడం విశేషం. ఈ జాబితాలో మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 159 మ్యాచ్ల్లో 14 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.
మొత్తం టీ20 క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా మలేషియాకు చెందిన విరన్దీప్ సింగ్ 22 అవార్డులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత సికందర్ రజా 19 అవార్డులతో రెండో స్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ 17 అవార్డులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
మ్యాచ్ విశ్లేషణ
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 29 పరుగుల తేడాతో యూఎస్ఏపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
ఈ ఇన్నింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. అతను 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు చేసి జట్టును గౌరవప్రదమైన స్కోర్కు చేర్చాడు. అతనికి మినహా మిగతా భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. తిలక్ వర్మ 25, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేసి కొంత మేర సహకరించారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి ఖాతా తెరవకుండానే అవుటయ్యారు. రింకూ సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5, అక్షర్ పటేల్ 14, అర్షదీప్ సింగ్ 4 పరుగులు మాత్రమే చేశారు.
యూఎస్ఏ బౌలర్లలో వాన్ స్కాల్విక్ నాలుగు వికెట్లు తీయగా, హర్మీత్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మొహమ్మద్ మొహిసిన్ మరియు అలీ ఖాన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
బౌలర్ల ధాటికి యూఎస్ఏ కుప్పకూలింది
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ఏ బ్యాటింగ్ భారత బౌలర్ల ధాటికి తడబడింది. సిరాజ్ నాలుగు ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశారు. ఫలితంగా యూఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది.
యూఎస్ఏ తరఫున సంజయ్ కృష్ణమూర్తి మరియు శుభమ్ రంజనే తలా 37 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిలింద్ కుమార్ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్ గౌస్ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్ ఖాన్ 8, స్కాల్విక్ 2 నాటౌట్గా నిలవగా, మోనాంక్ పటేల్ మరియు హర్మీత్ సింగ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు.
మరిన్నివార్తలుచదవండి: రాబోయే ICC క్రికెట్ టోర్నమెంట్లు 2025 నుంచి 2027 పూర్తి వివరాలు