T20 World Cup 2026 India Bangladesh Tension Pakistan Support Update

2026 టీ20 ప్రపంచకప్కు ముందు ఆసియా క్రికెట్లో మరోసారి రాజకీయ మరియు క్రీడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భద్రతా కారణాలను చూపిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, భారత్లో జరగాల్సిన తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై సమీక్షలు జరిపిన ఐసీసీ, భారత్లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని బీసీబీకి హామీ ఇచ్చింది.
అయినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన నిర్ణయంలో మార్పు చేయలేదు. భారత్లో పర్యటించేది లేదంటూ స్పష్టంగా ప్రకటించింది. దీంతో ఐసీసీ ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ భారత్లో ఆడేందుకు నిరాకరిస్తే, స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయ జట్టుగా ప్రపంచకప్లో పాల్గొనించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ బీసీబీకి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు గడువు విధించినట్లు సమాచారం.
ఈ పరిస్థితుల్లో ఐసీసీ తమ డిమాండ్ను పట్టించుకోకుండా భారత్లో ఆడేందుకు ఒత్తిడి చేస్తోందని బీసీబీ అంతర్జాతీయ వేదికపై ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సహాయాన్ని కూడా కోరినట్లు తెలుస్తోంది. బీసీబీ అభ్యర్థన కోసం ఎదురు చూస్తున్న పీసీబీ వెంటనే రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్తాన్ ఎంట్రీ
బంగ్లాదేశ్పై ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తోంది. ఐసీసీ బీసీబీపై ఒత్తిడి పెడితే తాము కూడా ప్రపంచకప్ ఆడమని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ అభ్యర్థనలో న్యాయం ఉందని, ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పీసీబీ పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో పాకిస్తాన్ రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరియు ఆ దేశానికి చెందిన ముఖ్య రాజకీయ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఐసీసీ మరియు బీసీసీఐకి వ్యతిరేకంగా, బీసీబీకి అనుకూలంగా పలు తీర్మానాలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏ జట్టుపై ఒత్తిడి లేదా బెదిరింపులు ఉండకూడదని, ప్రపంచకప్ మ్యాచ్లు పూర్తిస్థాయి భద్రతా వాతావరణంలో జరగాలని పీసీబీ అభిప్రాయపడుతోంది. అవసరమైతే బంగ్లాదేశ్ మ్యాచ్లను పాకిస్తాన్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా పీసీబీ ప్రకటించినట్లు సమాచారం. పాకిస్తాన్ ఎంట్రీతో ప్రపంచకప్లో బంగ్లాదేశ్ భవితవ్యం ఏ మలుపు తిరుగుతుందోనని క్రికెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
భారత్ బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యం
గత కొంతకాలంగా భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ 2026కు ముందు బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విడుదల చేయడంతో ఈ ఉద్రిక్తతలు క్రికెట్ రంగానికి కూడా విస్తరించాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ చర్యను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర అవమానంగా భావించింది. తమ జట్టును ప్రపంచకప్ కోసం భారత్కు పంపబోమని, మ్యాచ్ వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అంతేకాకుండా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిషేధించింది.
షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్లను కోల్కతా మరియు ముంబై వేదికలలో ఆడాల్సి ఉంది.
మరిన్నివార్తలుచదవండి: విదర్భ విజయం: విజయహజారే ట్రోఫీ ఫైనల్లో అథర్వ తైడే & అమన్ మోఖడే ప్రదర్శన