IPL

Team India Faces Concern Ahead of Namibia Match, Doubts Over Abhishek Sharma Fitness

by Krishna R

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 12న ఢిల్లీలో భారత్ మరియు నమీబియా మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిట్‌నెస్‌పై ఆందోళనలు మొదలయ్యాయి. అతని స్థానంలో సంజు సామ్సన్‌కు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అభిషేక్ శర్మ ఆడతాడా లేదా అనే సందిగ్ధం

నమీబియాతో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, అభిషేక్ శర్మ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఢిల్లీలో టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేయడానికి అతను హాజరుకాలేదు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో మిగతా ఆటగాళ్లంతా పాల్గొనగా, అభిషేక్ మాత్రం కనిపించలేదు.

అతను కడుపు సమస్యతో బాధపడుతున్న కారణంగా ప్రాక్టీస్ చేయలేకపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కేట్ కూడా ధృవీకరించాడు.

అసిస్టెంట్ కోచ్ అప్డేట్

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ర్యాన్ టెన్ డోస్కేట్, ఇంకా రెండు రోజులు సమయం ఉందని, నమీబియాతో జరిగే మ్యాచ్‌కు అభిషేక్ అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అయితే ప్రస్తుతానికి అతని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదని, రెండో మ్యాచ్‌లో అతని భాగస్వామ్యం ఇంకా స్పష్టంగా లేదని పేర్కొన్నాడు.

అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మొదటి బంతికే ఔటవడంతో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే.

సంజు సామ్సన్‌కు లక్కీ ఛాన్స్

అభిషేక్ శర్మ మ్యాచ్‌కు దూరమైతే, సంజు సామ్సన్ మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 12న జరిగే ఈ మ్యాచ్‌లో సంజు సామ్సన్, ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.

మొదటి మ్యాచ్‌లో సంజు సామ్సన్‌కు అవకాశం రాలేదు. ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ కారణంగా అతను జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఇప్పుడు అభిషేక్ లేనప్పుడు సంజుకు అవకాశం దక్కే అవకాశం ఉంది.

బుమ్రా రీఎంట్రీపై ఉత్కంఠ

అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా రెండో మ్యాచ్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా పూర్తిగా ఫిట్‌గా కనిపించాడు.

అయితే బుమ్రా జట్టులోకి వస్తే, తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మహమ్మద్ సిరాజ్‌ను కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సిరాజ్‌ను తప్పించే సాహసం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

వాషింగ్టన్ సుందర్‌కు గుడ్ న్యూస్

టీమిండియాకు మరో శుభవార్త ఏమిటంటే వాషింగ్టన్ సుందర్ జట్టులోకి తిరిగి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సైడ్ స్ట్రెయిన్‌తో బాధపడిన అతను ఇప్పుడు పూర్తిగా కోలుకుని జట్టులో చేరాడు.

మరిన్నివార్తలుచదవండిశ్రీలంకకు భారీ దెబ్బ.. హసరంగ టి20 వరల్డ్‌కప్ మొత్తానికి దూరం