IPL

Team India New T20 Jersey Revealed for World Cup 2026, Rohit Sharma Named Brand Ambassador

by Guna SRV

టీ20 వరల్డ్ కప్ 2026 కోసం టీమిండియా జెర్సీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా విడుదల చేసింది. రాయ్‌పూర్‌లో జరుగుతున్న భారత్–సౌతాఫ్రికా రెండో వన్డే సందర్భంగా ఈ కొత్త జెర్సీని ఆవిష్కరించారు. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాల్గొన్నారు.

వీరితో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, తిలక్ వర్మ కూడా ఈ కార్యక్రమానికి హాజరై, కొత్త జెర్సీ కిట్‌లతో ఫోటోలకు పోజులిచ్చారు. అంతేకాకుండా, భారత్–శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా ఈవెంట్‌కు రోహిత్ శర్మను అధికారిక బ్రాండ్ అంబాసడర్‌గా నియమించారు.

అవిష్కరణ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ, “భారత జట్టుకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి” అని అన్నారు. ఈసారి విడుదలైన జెర్సీలో భారత త్రివర్ణ జెండా మూడు రంగులు కలగలిపి ఉన్నాయి.

ప్రధానంగా ముదురు నీలం రంగు ప్రధానంగా కనిపించగా, ఇరు వైపులా ఆరెంజ్ కలర్ డిజైన్ ఉంది. కాలర్ దగ్గర తెలుపు రంగు ఉండటం ప్రత్యేకత. జెర్సీ మధ్యలో స్పాన్సర్ Apollo Tyres పేరు, అలాగే INDIA అని ప్రింట్ చేశారు. ఈ కొత్త జెర్సీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

టీ20 వరల్డ్ కప్ గ్రూపులు

ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుంది. భారత్ గ్రూప్–A లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌తోపాటు పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా జట్లు ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న వాంఖడే స్టేడియంలో అమెరికాతో ఆడనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్–పాకిస్తాన్ మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్‌కు ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

మరిన్ని వార్తలు చదవండి: భారత్ vs దక్షిణాఫ్రికా T20I సిరీస్ 2025: జట్టు, పూర్తి షెడ్యూల్, వేదికలు & ముఖ్య అప్‌డేట్స్