
విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించిన 18 మంది సభ్యుల పంజాబ్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్ చోటు దక్కించుకున్నారు. అలాగే ప్రభ్సిమ్రన్ సింగ్, నమన్ ధీర్, అన్మోల్ప్రీత్ సింగ్, రమణదీప్ సింగ్, సన్వీర్ సింగ్, హర్ప్రీత్ బ్రార్ వంటి కీలక ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారు.
అయితే గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్లు ఈ టోర్నీలో ఎన్ని మ్యాచ్లు ఆడతారు అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. టీమిండియా జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 21 నుంచి అదే జట్టుతో టీ20 సిరీస్ కూడా జరగనుంది. భారత వన్డే జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్లు భారత టీ20 జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ జట్టు లీగ్ దశలో మొత్తం ఏడు మ్యాచ్లను జైపూర్ వేదికగా ఆడనుంది. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా, ముంబై జట్లతో పంజాబ్ తలపడనుంది. లీగ్ మ్యాచ్లు జనవరి 8న ముగియనున్నాయి. అయితే పంజాబ్ జట్టు కెప్టెన్ ఎవరో అన్న విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు.
విజయ్ హజారే ట్రోఫీ కోసం పంజాబ్ జట్టు
శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్, ప్రభ్సిమ్రన్ సింగ్ వికెట్ కీపర్, హర్నూర్ పన్ను, అన్మోల్ప్రీత్ సింగ్, ఉదయ్ సహారన్, నమన్ ధీర్, సలీల్ అరోరా వికెట్ కీపర్, సన్వీర్ సింగ్, రమణదీప్ సింగ్, జషన్ప్రీత్ సింగ్, గుర్నూర్ బ్రార్, హర్ప్రీత్ బ్రార్, రఘు శర్మ, క్రిష్ భగత్, గౌరవ్ చౌదరి, సుఖదీప్ బజ్వా
ఈ జట్టుతో పంజాబ్ విజయ్ హజారే ట్రోఫీలో బలమైన ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తోంది.
మరిన్ని వార్తలు చదవండి: వెస్టిండీస్కు భారీ షాక్.. మూడో టెస్టులో న్యూజిలాండ్ 323 పరుగుల విజయం