అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో విరాట్ కోహ్లీ తాజాగా సాధించిన ఈ సెంచరీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కోహ్లీ చేసిన ఈ హండ్రెడ్తో మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో వ్యక్తిగత సెంచరీల మొత్తం సంఖ్య 7000కు చేరింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో 7000వ సెంచరీ విరాట్ కోహ్లీ పేరిట నమోదు అయింది.
Virat Kohli Creates History: Breaks Sachin’s Record with 52nd ODI Century!

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెడితే రికార్డులు పడిపోవడం కొత్తేమీ కాదు. ఆదివారం రాంచీలో జరిగిన దక్షిణాఫ్రికాతో మొదటి వన్డేలో కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో చూపించాడు. కేవలం 102 బంతుల్లోనే అద్భుతమైన శతకం సాధించి, తన వన్డే కెరీర్లో 52వ సెంచరీని నమోదు చేశాడు.
ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించాడు. ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడుగా నిలిచాడు. దీతో టెస్ట్ ఫార్మాట్లో 51 సెంచరీలు చేసిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మహా రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.
2023లోనే సచిన్ (49 వన్డే సెంచరీలు) రికార్డును అధిగమించిన కోహ్లీ, ఇప్పుడు వన్డేల్లో 52 సెంచరీలతో చరిత్రలో ఎవరికీ అందని ఎత్తుకు చేరుకున్నాడు. 37 ఏళ్ల ఈ స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా కూడా కొత్త రికార్డు సృష్టించాడు.
దక్షిణాఫ్రికాపై ఇప్పటివరకు కోహ్లీ 6 సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్ 57 వన్డేల్లో 5 సెంచరీలు సాధించగా, కోహ్లీ కేవలం 32 మ్యాచ్ల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ మరో అరుదైన మైలురాయిని కూడా చేరుకున్నాడు.
భారత్లో వన్డేల్లో అత్యధిక 50-ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడు ఇప్పుడు విరాట్ కోహ్లీ. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి భారత హోమ్ గ్రౌండ్స్లో 100 సార్లు 50+ స్కోరు చేసిన తొలి భారతీయుడుగా కూడా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.
మరిన్ని వార్తలు చదవండి: రోహిత్ శర్మ కొత్త సునామీ.. సిక్సర్లతో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసిన హిట్మ్యాన్