Virat Kohli Set to Break Sachin Tendulkar Record Against New Zealand in ODIs

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే మ్యాచ్ వడోదర వేదికగా జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు వడోదరకు చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఈ సిరీస్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఒక అరుదైన రికార్డు అందుబాటులోకి వచ్చింది.
కివీస్తో జరుగనున్న వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ మరో 94 పరుగులు చేస్తే, న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్పై 41 ఇన్నింగ్స్లలో 46.05 సగటుతో మొత్తం 1750 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే, అతడు ఇప్పటివరకు 33 ఇన్నింగ్స్లలో 55.23 సగటుతో 1657 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి.
ఈ జాబితాలో మూడో స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. అతడు కేవలం 23 ఇన్నింగ్స్లలోనే 52.59 సగటుతో 1157 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.
వన్డేల్లో న్యూజిలాండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు
| స్థానం | ఆటగాడు | పరుగులు |
|---|---|---|
| 1 | సచిన్ టెండూల్కర్ | 1750 |
| 2 | విరాట్ కోహ్లీ | 1657 |
| 3 | వీరేంద్ర సెహ్వాగ్ | 1157 |
| 4 | మహ్మద్ అజారుద్దీన్ | 1118 |
| 5 | సౌరవ్ గంగూలీ | 1079 |
విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో మంచి ఫామ్ కొనసాగిస్తే, సచిన్ రికార్డును అధిగమించే అవకాశం పూర్తిగా ఉంది. క్రికెట్ అభిమానులు ఈ రికార్డు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్నివార్తలుచదవండి: విజయ్ హజారే ట్రోఫీ 2025-26: ఈ సీజన్లో అతిపెద్ద ఇన్నింగ్స్