Women’s T20 World Cup 2026: Groups, Teams and Prize Money Revealed

అంతర్జాతీయ క్రికెట్ మండలి International Cricket Council మహిళల T20 వరల్డ్ కప్ 2026 కోసం రికార్డు స్థాయి ప్రైజ్ మనీ ప్రకటించింది. ఈ టోర్నమెంట్ జూన్ 12 నుంచి ఇంగ్లాండ్ మరియు వేల్స్లో ప్రారంభమవుతుంది.
ఈసారి టోర్నమెంట్ను 12 జట్లకు విస్తరించారు. మొత్తం 33 మ్యాచ్లు జరగనున్నాయి.
పాల్గొనే జట్లు
ఈ టోర్నమెంట్లో పాల్గొనే జట్లు:
ఇంగ్లాండ్. శ్రీలంక. ఆస్ట్రేలియా. బంగ్లాదేశ్. భారత్. ఐర్లాండ్. నెదర్లాండ్స్. న్యూజిలాండ్. పాకిస్తాన్. స్కాట్లాండ్. దక్షిణాఫ్రికా. వెస్టిండీస్.
గ్రూపుల వివరాలు
గ్రూప్ Bలో ఇంగ్లాండ్. ఐర్లాండ్. స్కాట్లాండ్. న్యూజిలాండ్. శ్రీలంక. వెస్టిండీస్ ఉన్నాయి.
గ్రూప్ Aలో ఆస్ట్రేలియా. భారత్. పాకిస్తాన్. దక్షిణాఫ్రికా. బంగ్లాదేశ్. నెదర్లాండ్స్ ఉన్నాయి.
రికార్డు ప్రైజ్ మనీ
మహిళల T20 వరల్డ్ కప్ 2026 కోసం మొత్తం ప్రైజ్ మనీ USD 8,764,615 (సుమారు రూ. 81.8 కోట్లు)గా నిర్ణయించారు. ఇది 2024తో పోలిస్తే 10 శాతం ఎక్కువ.
- విజేతకు USD 2,340,000 (సుమారు రూ. 21.8 కోట్లు)
- రన్నరప్కు USD 1,170,000 (సుమారు రూ. 10 కోట్లు)
- సెమీఫైనల్ ఓడిన జట్లకు USD 675,000
- ప్రతి గ్రూప్ మ్యాచ్ గెలిచినప్పుడు USD 31,154
- ప్రతి జట్టుకు కనీసం USD 247,500
ICC స్పందన
ICC CEO Sanjog Gupta మహిళల క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ప్రైజ్ మనీ పెంపు మరియు జట్ల సంఖ్య పెరగడం ఈ అభివృద్ధికి నిదర్శనం అన్నారు.
అతను ఇంకా మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని చెప్పారు.
మొదటి మ్యాచ్
టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఇంగ్లాండ్ మరియు శ్రీలంక మధ్య జూన్ 12న బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరుగుతుంది.
మహిళల T20 వరల్డ్ కప్ 2026 ఎక్కువ జట్లు. భారీ ప్రైజ్ మనీ. అంతర్జాతీయ స్థాయిలో మరింత ఆసక్తిని పెంచబోతుంది.