IPL

WPL 2026 setback for RCB and Delhi Capitals as star players pull out

by Krishna R

వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న మహిళల ఐపీఎల్ 2026కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మరియు ఆస్ట్రేలియా క్రికెటర్ ఎల్లిస్ పెర్రీ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ మొత్తానికి దూరంగా ఉండనుంది. ఆమె స్థానంలో దేశీయ ఆల్ రౌండర్ సయాలీ సత్ఘరేను ఆర్సీబీ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది.

సయాలీ సత్ఘరే గతంలో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. మహిళల ఐపీఎల్ 2026 వేలంలో ఆమెను ముప్పై లక్షల కనీస ధరతో ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే ఎల్లిస్ పెర్రీ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో సయాలీకి ఆర్సీబీ జట్టులో చోటు దక్కింది. ప్రస్తుతం ఆర్సీబీలో నడినే డి క్లెర్క్ మాత్రమే అనుభవం ఉన్న విదేశీ ఆల్ రౌండర్ గా మిగిలింది.

ఎల్లిస్ పెర్రీ 2024 మహిళల ఐపీఎల్‌లో ఆర్సీబీ టైటిల్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఆమెకు డబ్ల్యూపీఎల్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ లీగ్‌లో ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్ కూడా ఎల్లిస్ే. ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడిన ఆమె ఎనిమిది అర్ధ సెంచరీలతో 972 పరుగులు సాధించడంతో పాటు 8.25 ఎకానమీతో 14 వికెట్లు తీసింది.

ఇదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకూ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మరియు ఆస్ట్రేలియా ప్లేయర్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ కూడా వ్యక్తిగత కారణాలతో మహిళల ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరం కానుంది. ఆమె స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ అలానా కింగ్‌ను జట్టులోకి తీసుకుంది.

మరిన్నివార్తలుచదవండిIPL 2026 ముందు యశ్ దయాల్ అరెస్ట్ వార్తలు, సీనియర్ బౌలర్‌కు ఛాన్స్?