IPL

Yuzvendra Chahal’s Viral Comment: Indirect Dig at Ex-Wife? Instagram Live Sparks Debate

by Krishna R

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో, సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటాడు. గురువారం రాత్రి జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో చాహల్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. పంజాబ్ కింగ్స్ సహచరులు రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లతో చాట్ చేస్తూ, తన మాజీ భార్య ధనశ్రీ వర్మపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్టు అభిమానులు భావిస్తున్నారు. విడాకులు, భరణం చెల్లింపుల నేపథ్యంలో చాహల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గురువారం రాత్రి చాహల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురి మధ్య వివాహాలపై చర్చ సాగింది. రవి బిష్ణోయ్ ఇటీవల కొన్ని పెళ్లిళ్లకు హాజరైనట్లు చెప్పగా, చాహల్ వెంటనే అర్ష్‌దీప్‌ను “నువ్వూ త్వరగా పెళ్లి చేసుకో” అంటూ సరదాగా ఒత్తిడి చేశాడు.

దీనిపై అర్ష్‌దీప్ కాస్త ఆశ్చర్యంగా “ఎందుకు?” అని అడగగా, చాహల్ వెంటనే చమత్కారంగా “నీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది” అని అన్నాడు. ఈ ఒక్క లైన్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను హోరెత్తిస్తోంది. అభిమానులు దీన్ని అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సెటైర్‌గా భావిస్తున్నారు.

చాహల్ 2020లో యూట్యూబర్–కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్నాడు. అయితే 2022లో ఇద్దరూ విడిపోయి, ఈ సంవత్సరం ప్రారంభంలో విడాకులు ఖరారయ్యాయి. మీడియా రిపోర్ట్స్‌కు అనుసరించి చాహల్ తన మాజీ భార్యకు భరణంగా రూ.4.75 కోట్లకు పైగా చెల్లించినట్లు తెలుస్తోంది. చివరి విచారణ రోజున "Be Your Own Sugar Daddy" అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి చాహల్ కోర్టుకు రావడం అప్పట్లో పెద్ద చర్చకెక్కింది. ఇప్పుడు లైవ్ సెషన్‌లో చేసిన బ్యాంక్ బ్యాలెన్స్ వ్యాఖ్య కూడా అదే నేపథ్యాన్ని గుర్తుచేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం చాహల్, అర్ష్‌దీప్ ఇద్దరూ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఫ్రాంఛైజీ వీరిద్దరినీ దాదాపు రూ.18 కోట్లకు పైగా కొనుగోలు చేసింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన చాహల్ రికార్డును ఇటీవల అర్ష్‌దీప్ అధిగమించాడు. అయినప్పటికీ, ఐపీఎల్ చరిత్రలో 200+ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా చాహల్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నాడు.

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో, సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటాడు. గురువారం రాత్రి జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో చాహల్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. పంజాబ్ కింగ్స్ సహచరులు రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లతో చాట్ చేస్తూ, తన మాజీ భార్య ధనశ్రీ వర్మపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్టు అభిమానులు భావిస్తున్నారు. విడాకులు, భరణం చెల్లింపుల నేపథ్యంలో చాహల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గురువారం రాత్రి చాహల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురి మధ్య వివాహాలపై చర్చ సాగింది. రవి బిష్ణోయ్ ఇటీవల కొన్ని పెళ్లిళ్లకు హాజరైనట్లు చెప్పగా, చాహల్ వెంటనే అర్ష్‌దీప్‌ను “నువ్వూ త్వరగా పెళ్లి చేసుకో” అంటూ సరదాగా ఒత్తిడి చేశాడు.

దీనిపై అర్ష్‌దీప్ కాస్త ఆశ్చర్యంగా “ఎందుకు?” అని అడగగా, చాహల్ వెంటనే చమత్కారంగా “నీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది” అని అన్నాడు. ఈ ఒక్క లైన్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను హోరెత్తిస్తోంది. అభిమానులు దీన్ని అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సెటైర్‌గా భావిస్తున్నారు.

చాహల్ 2020లో యూట్యూబర్–కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్నాడు. అయితే 2022లో ఇద్దరూ విడిపోయి, ఈ సంవత్సరం ప్రారంభంలో విడాకులు ఖరారయ్యాయి. మీడియా రిపోర్ట్స్‌కు అనుసరించి చాహల్ తన మాజీ భార్యకు భరణంగా రూ.4.75 కోట్లకు పైగా చెల్లించినట్లు తెలుస్తోంది.

చివరి విచారణ రోజున "Be Your Own Sugar Daddy" అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి చాహల్ కోర్టుకు రావడం అప్పట్లో పెద్ద చర్చకెక్కింది. ఇప్పుడు లైవ్ సెషన్‌లో చేసిన బ్యాంక్ బ్యాలెన్స్ వ్యాఖ్య కూడా అదే నేపథ్యాన్ని గుర్తుచేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం చాహల్, అర్ష్‌దీప్ ఇద్దరూ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఫ్రాంఛైజీ వీరిద్దరినీ దాదాపు రూ.18 కోట్లకు పైగా కొనుగోలు చేసింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన చాహల్ రికార్డును ఇటీవల అర్ష్‌దీప్ అధిగమించాడు. అయినప్పటికీ, ఐపీఎల్ చరిత్రలో 200+ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా చాహల్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నాడు.

మరిన్ని వార్తలు చదవండి: 2027 ప్రపంచకప్‌పై రోహిత్, కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్? అహ్మదాబాద్‌లో కీలక సమావేశం!