
అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడవ టెస్టులో ఆస్ట్రేలియా విజయం 4 వికెట్ల దూరంలో ఉంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు మళ్లీ నిరాశపరిచే ప్రదర్శన కనబరిచింది.
నాలుగో రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోగా 207 పరుగులు చేసింది. ఇంకా 228 పరుగుల వెనుకంజలో ఉంది. ఇంగ్లాండ్ విజయాన్ని సాధించాలంటే ఏదో అద్భుతమైన ప్రదర్శన అవసరం. క్రీజులో జెమ్మీ స్మిత్ 2 మరియు విల్ జాక్స్ 11 పరుగులతో ఉన్నారు.
భారీ లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ కీలకమైన మూడు వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ను బ్యాక్ఫుట్లో ఉంచాడు. జాక్ క్రాలీ 85 పరుగులతో ఇంగ్లాండ్ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు, కాగా జోరూట్ 39 పరుగులు చేసి సగటున ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్తో పాటు పాట్ కమిన్స్ కూడా మూడు వికెట్లు సాధించాడు.
హెడ్ అద్భుత సెంచరీ ప్రదర్శన…
ముందుగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 349 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో పొందిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లాండ్ ముందు 435 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 219 బంతుల్లో 170 పరుగులు, 16 ఫోర్లు, 2 సిక్స్లతో అద్భుత సెంచరీ సాధించాడు. అలెక్స్ కేరీ 72 పరుగులు చేసి జట్టుకు మద్దతు ఇచ్చాడు.
ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మూడవ టెస్టు కూడా ఆస్ట్రేలియా గెలిస్తే, మిగిలిన రెండు టెస్టులు ఆడకముందే యాషెస్ సిరీస్ కంగారూల సొంతం అవ్వనుంది.
మరిన్ని వార్తలు చదవండి: విజయ్ హజారే ట్రోఫీ 2025: ఢిల్లీ జట్టులో విరాట్ కోహ్లి, కెప్టెన్గా రిషభ్ పంత్