IPL

All Matches to Be Played at the Same Venue Till January 15 – BCCI’s Key Decision

by Krishna R

లక్నోలోని ఎకానా స్టేడియంలో నిన్న జరగాల్సిన భారత్-దక్షిణాఫ్రికా నాల్గో టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకముందే మంచు కారణంగా రద్దు కావడం గట్టి చర్చకు కారణమైంది. మంచు వర్షం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, బీసీసీఐ ఈ మ్యాచ్ ను షెడ్యూల్ చేయడాన్ని, తర్వాత రద్దు చేయడాన్ని ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇప్పటికే ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో కూడా మంచు ప్రభావం స్పష్టంగా కనిపించిందని గుర్తించవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్దమవుతోంది.

భారతదేశంలో మంచు ఎక్కువగా కురిసే ఈ సీజన్‌లో, బీసీసీఐ పలు అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాళీ టోర్నీలను కూడా నిర్వహించాల్సి ఉంది. అందులో జైపూర్ వేదికగా డిసెంబర్ 24 నుండి జనవరి 18 వరకు విజయ్ హజారే ట్రోఫీ 50 ఓవర్ల టోర్నమెంట్ జరగనుంది.

అలాగే, భారత్-దక్షిణాఫ్రికా మధ్య చివరి టీ20 రేపు అహ్మదాబాద్‌లో జరగనుంది. ఆ తర్వాత, భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ కూడా జనవరి 11 నుండి ప్రారంభం కానుంది. దీనికి వడోదర, రాజ్‌కోట్, ఇండోర్ వేదికలు ఇప్పటికే నిర్ణయించబడ్డాయి.

తాజాగా లక్నోలో భారీ మంచు కారణంగా టీ20 మ్యాచ్ రద్దు కావడంతో, బీసీసీఐపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించడానికి బీసీసీఐ పెద్దలు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఉత్తర భారతదేశంలో షెడ్యూల్ చేసిన మ్యాచ్‌లను దక్షిణాది మరియు పశ్చిమ భారతదేశంలోని నగరాలకు మార్చడానికి అవకాశాలను పరిశీలిస్తున్నారు.

అయితే, భారత్-దక్షిణాఫ్రికా చివరి టీ20 మ్యాచ్ వేదికను మార్చేందుకు సమయం లేకపోవడంతో, అది అహ్మదాబాద్‌లోనే నిర్వహించబడే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగే విజయ్ హజారే ట్రోఫీ మరియు భారత్-కివీస్ సిరీస్ మ్యాచ్‌లను దక్షిణాదిలోని వేదికలకు తరలించనున్నారు.

మరిన్ని వార్తలు చదవండి: IPL 2026: పంజాబ్ కింగ్స్ పూర్తి జట్టు విడుదల.. ఈసారి కప్ పంజాబ్‌కేనా?