Faf du Plessis Bids Goodbye to IPL; Confirms Participation in PSL!

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ సంచలన నిర్ణయం ప్రకటించాడు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు నేనే.. ఐపీఎల్కు గుడ్బై చెబుతున్నట్లు వెల్లడించాడు! ఈ సంవత్సరం జరిగే వేలంలో తాను పాల్గొనబోవడం లేదని, తన పేరు రిజిస్టర్ చేసుకోవడం లేదని సోషల్మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు.
ఐపీఎల్కు బదులుగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడతానని కూడా స్పష్టం చేశాడు. గతంలో ఫాఫ్ డుప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
డుప్లెసిస్ ఐపీఎల్లో మొత్తం 14 సీజన్లు ఆడిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రపంచ స్థాయి క్రీడాకారులతో కలిసి ఆడే అవకాశాన్ని ఈ లీగ్ తనకు ఇచ్చిందని రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు. ఐపీఎల్ 19వ సీజన్కు ముందే ఆయన చేసిన ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.
“14 ఏళ్లు ఐపీఎల్లో ఆడాను. కానీ ఈసారి మాత్రం నా పేరు వేలం కోసం రిజిస్టర్ చేసుకోవడం లేదు. ఐపీఎల్ వంటి భారీ లీగ్లో ఆడకపోవడం నిజంగా పెద్ద నిర్ణయం. నా కెరీర్లో ఈ లీగ్ పాత్ర మరుపురానిది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడటం, అద్భుతమైన ఫ్రాంచైజీలను ప్రాతినిధ్యం వహించడం, క్రికెట్ను ప్రేమించే కోట్లాది అభిమానుల ముందు ఆడటం – ఇవన్నీ నాకు గొప్ప అనుభవాలు. భారత్ నాకు ఎన్నో మంచి స్నేహితులను ఇచ్చింది. జీవితం మీద ఎన్నో పాఠాలు, అందమైన జ్ఞాపకాలు అందించింది. క్రికెటర్గా, వ్యక్తిగా నన్ను పూర్తిగా మార్చింది,” అని ఫాఫ్ డుప్లెసిస్ భావోద్వేగంగా పేర్కొన్నాడు.
అతను ఇంకా ఇలా అన్నాడు:
“నా ప్రయాణంలో ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహించిన కోచ్లు, సహచరులు, సపోర్ట్ స్టాఫ్, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఐపీఎల్కు పూర్తిస్థాయి గుడ్బై కాదు. మళ్లీ నన్ను ఐపీఎల్లో తప్పక చూస్తారు. కానీ ఈసారి మాత్రం కొత్త సవాల్ని స్వీకరించాలని అనిపించింది. అందుకే పీఎస్ఎల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాను.”
ఐపీఎల్లో డుప్లెసిస్ మొత్తం 154 మ్యాచ్లు ఆడాడు. 135.79 స్ట్రైక్రేట్తో 4,773 పరుగులు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ — మొత్తం నాలుగు జట్ల తరఫున అతను ఆడాడు. ఇక అబుదాబీలో డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.
మరిన్ని వార్తలు చదవండి: స్మృతి మంధాన పెళ్లిపై వస్తున్న పుకార్లకు ముగింపు: అసలు నిజం ఇదే