ICC Intervenes in India Pakistan T20 World Cup Dispute, Imran Khwaja Appointed Mediator

భారత్ మరియు పాకిస్తాన్ మధ్య టీ20 ప్రపంచకప్కు సంబంధించిన వివాదంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ జోక్యం చేసుకుంది. ఫిబ్రవరి పదిహేనున కొలంబోలో భారత్తో జరగాల్సిన గ్రూప్ దశ మ్యాచ్ను పాకిస్తాన్ బహిష్కరించాలన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ సున్నిత అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ఉద్దేశంతో ఐసీసీ ఒక మధ్యవర్తిని నియమించింది. సింగపూర్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన అనుభవజ్ఞుడైన నిర్వాహకుడు ఇమ్రాన్ ఖ్వాజాను ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్ చేసింది. ఆయన గతంలో ఐసీసీ తాత్కాలిక చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించడంతో పాటు, ప్రధాన క్రికెట్ బోర్డులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖ్వాజా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతూ, భారత్తో మ్యాచ్ ఆడేలా పీసీబీ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖ్వాజా మధ్యవర్తిత్వం విజయవంతమైతే, పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మ్యాచ్కు అంగీకరిస్తుందని ఐసీసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అయితే, ఖ్వాజా మధ్యవర్తిత్వాన్ని కూడా పాకిస్తాన్ పట్టించుకోకపోతే, ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై జై షా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. పాకిస్తాన్కు చివరి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ఖ్వాజాను మధ్యవర్తిగా పంపినట్లు ఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
టెక్నికల్ లోపాలను ఆసరాగా చేసుకొని పాకిస్తాన్ అనవసరంగా పరిస్థితిని సంక్లిష్టం చేస్తోందన్నది జై షా అభిప్రాయం. ఈ అంశంపై పీసీబీ ఇప్పటివరకు లిఖితపూర్వకంగా తమ నిర్ణయాన్ని తెలియజేయకుండా తప్పించుకుంటోంది.
ఐసీసీ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమై, పాకిస్తాన్ భారత్తో గ్రూప్ దశ మ్యాచ్ ఆడకూడదన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటే, ఆ జట్టే తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ప్రపంచకప్లో కీలక పాయింట్లు కోల్పోవడంతో పాటు, మ్యాచ్ జరగకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు కూడా పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అనంతరం పాలనా మరియు ఆర్థిక పరమైన పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి ఏడున టీ20 ప్రపంచకప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున భారత్ మరియు పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్లు ఆడనున్నాయి. పాకిస్తాన్ నెదర్లాండ్స్తో తలపడగా, భారత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పోటీపడుతుంది. పాకిస్తాన్ తమ అన్ని మ్యాచ్లను శ్రీలంకలో ఆడనుంది.
మరిన్నివార్తలుచదవండి: హెచ్సీఏ కొత్త అధ్యక్షుడు అమర్నాథ్, జగన్మోహన్ రావు పదవి నుంచి తొలగింపు