IPL

India vs South Africa Vizag ODI: Ticket Details, Stadium Capacity, Team Updates

by Krishna R

భారత్–దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు విశాఖపట్నం యజమాన్యం వహించనుంది. డిసెంబర్ 6న జరగబోయే ఈ పోరుకు రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. చాలాకాలం తర్వాత వైజాగ్‌లో టీమిండియా వన్డే ఆడటం, అదీ రోహిత్ శర్మ–విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్లు మళ్లీ బరిలోకి దిగడం వల్ల మ్యాచ్‌పై హైప్ మరింత పెరిగింది.

[ Poll: AL7O4zLO ]

టికెట్లకు భారీ డిమాండ్

ఈ మ్యాచ్ కోసం అభిమానులు ముందుగానే టికెట్ వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తం సీటింగ్ కెపాసిటీ 27,500 కాగా, అందులో 22,000 టికెట్లు ఆన్‌లైన్ ద్వారా విక్రయించనున్నారు.

టికెట్ సేల్ వివరాలు

నవంబర్ 28 నుంచి జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంటాయి. టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి:

టికెట్ కేటగిరీ ధర
జనరల్ ₹1200
స్టాండర్డ్ ₹2000 – ₹5000
ప్రీమియం ₹10,000
VIP ₹15,000
VVIP ₹18,000

అన్ని టికెట్లు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే అమ్ముతారు.

వన్డే సిరీస్ షెడ్యూల్

మూడు వన్డేల సిరీస్ ఇలా ఉంటుంది:

మ్యాచ్ తేదీ వేదిక
1వ వన్డే నవంబర్ 30 రాంచీ
2వ వన్డే డిసెంబర్ 3 రాయ్‌పూర్
3వ వన్డే డిసెంబర్ 6 విశాఖపట్నం

టీమిండియా స్క్వాడ్ – కీలక మార్పులు

బీసీసీఐ ఆదివారం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది.సాధారణ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో, వైస్–కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్లీహం గాయంతో దూరం కావడంతో, ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్గా ఎంపికయ్యాడు.

టీమిండియా మేనేజ్‌మెంట్ 2026 టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతి ఇచ్చింది. గాయంతో బయట ఉన్న హార్దిక్ పాండ్యాకు కూడా ఈ సిరీస్‌లో అవకాశం ఇవ్వలేదు.

దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. యువ ఆటగాడు తిలక్ వర్మకు కూడా వన్డేల్లో అవకాశం లభించింది. అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇచ్చాడు.

పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కൃഷ്ണలకు చోటు లభించగా, పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టులోకి చేరాడు.

సౌతాఫ్రికా వన్డే సిరీస్ – భారత జట్టు

విభాగం ఆటగాళ్లు
ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్
టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ
మిడిల్ ఆర్డర్ & వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్
ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి
స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్
పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ
రిజర్వ్ బాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్

మరిన్ని వార్తలు చదవండి: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26: రుతురాజ్ గైక్వాడ్‌కు షాక్.. మహారాష్ట్రకు కొత్త కెప్టెన్‌గా పృథ్వీ షా