IPL

India Women vs Sri Lanka Women 4th T20 2025–26 Result and Smriti Mandhana Record

by Krishna R

ఆదివారం శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు మరోసారి అద్భుతమైన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే తొలి మూడు మ్యాచ్‌లను గెలుచుకున్న భారత మహిళల జట్టు, నాలుగో టీ20లోనూ గెలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. దీంతో ఈ సిరీస్‌లో భారత్ 4-0తో భారీ ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి భారీ స్కోర్ నమోదు చేసింది. లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది.

స్మృతి మంధాన రికార్డు ఘనత

ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన మరియు షెఫాలీ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. స్మృతి మంధాన 48 బంతుల్లో 80 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ 46 బంతుల్లో 79 పరుగులతో మెరిశారు. వీరితో పాటు రిచా ఘోష్ 16 బంతుల్లో 40 పరుగులు, హర్మన్‌ప్రీత్ కౌర్ 10 బంతుల్లో 16 పరుగులు చేసి జట్టుకు మరింత బలం చేకూర్చారు.

ఈ మ్యాచ్‌తో స్మృతి మంధాన మరో గొప్ప మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత మహిళా బ్యాటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఆమె స్థిరమైన ప్రదర్శన టీమిండియా విజయాల్లో ఎంత కీలకమో మరోసారి నిరూపితమైంది.

మరిన్నివార్తలుచదవండిICC U-19 వరల్డ్ కప్ 2026: భారత అండర్-19 జట్టు ప్రకటింపు