ICC U-19 వరల్డ్ కప్ 2026: భారత అండర్-19 జట్టు ప్రకటింపు

బీసీసీఐ జూనియర్ క్రికెట్ కమిటీ అండర్-19 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించింది. శనివారం (డిసెంబర్ 27) సాయంత్రం విడుదల చేసిన జట్టులో డ్యాషింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కింది. అలాగే, సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డే మ్యాచ్ల కోసం జట్టును కూడా ప్రకటించారు.
ICC మెన్స్ U-19 వరల్డ్ కప్ 2026 ఈవెంట్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియాలో జరుగుతుంది. ఈ ప్రపంచ కప్లో 16 టీమ్స్ పాల్గొంటున్నాయి. మొత్తం నాలుగు గ్రూపులుగా పోటీలను నిర్వహించి, సూపర్ సిక్స్ స్టేజ్, సెమీ ఫైనల్ మరియు హరారేలో ఫైనల్ ఉంటుంది.
ఇందులో ఐదు సార్లు ఛాంపియన్ అయిన భారతదేశం గ్రూప్-Bలో ఉంది. ఈ గ్రూప్లో న్యూజీలాండ్, బంగ్లాదేశ్, అమెరికా టీమ్స్ ఉన్నాయి. జనవరి 15న బులవాయోలోని స్పోర్ట్స్ క్లబ్లో యూఎస్ఏతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 17న బంగ్లాదేశ్, జనవరి 24న న్యూజీలాండ్తో మ్యాచ్లు జరుగుతాయి.
ICC మెన్స్ U-19 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టు:
ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), R.S. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఎ. పటేల్, మహ్మద్ ఈనాన్, హెనిల్ పటేల్, డి. దీపేష్, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్
మరిన్నివార్తలుచదవండి: గిల్ షాకింగ్ కాల్! రోహిత్, కోహ్లీ చేసినదే ఇప్పుడు శుభ్మన్ కూడా
తరచుగా అడిగే ప్రశ్నలు
ICC U-19 వరల్డ్ కప్ 2026 జింబాబ్వే మరియు నమీబియాలో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగుతుంది.
భారత అండర్-19 జట్టులో ఆయుష్ మాత్రే కెప్టెన్గా నియమించబడ్డాడు, విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.