Punjab Captain Abhishek Sharma Smashes Another Quickfire Fifty in SMAT 2024

ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20లకు విరామం వచ్చిన నేపథ్యంలో, దేశవాళీ టీ20 టోర్నమెంట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరఫున ఆడుతున్న అభిషేక్… ఇక్కడ కూడా ప్రత్యర్థి బౌలర్లపై అదే దూకుడుతో విరుచుకుపడుతున్నాడు.
పంజాబ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అభిషేక్, రెండు రోజుల క్రితం బెంగాల్పై 52 బంతుల్లో 148 పరుగులతో సుడిగాలి శతకం నమోదు చేశాడు. ఆ దుమారం ఇంకా చల్లారకముందే, ఇవాళ (డిసెంబర్ 2) బరోడాపై మరొక మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. కేవలం 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాది అర్ధశతకం నమోదు చేశాడు.
తర్వాత రాజ్ లింబాని బౌలింగ్లో అభిషేక్ ఔటయ్యాడు. అతనితో పాటు అన్మోల్ప్రీత్ సింగ్ (32 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడడంతో పంజాబ్ తొలి బ్యాటింగ్లోనే 20 ఓవర్లలో 8 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు చేసింది. నమన్ ధిర్ (28 బంతుల్లో 39) కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన బరోడా కూడా అగ్గి జ్వాలల్లా ఆరంభించింది. 4 ఓవర్లకే వికెట్ కోల్పోకుండా 51 పరుగులు చేసింది. ఓపెనర్లు శాశ్వత్ రావత్ 30, విష్ణు సోలంకి 14 పరుగులతో క్రీజులో నిలకడగా ఉన్నారు.
ఇక దీనికి ముందు బెంగాల్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ కేవలం 12 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేసి సంచలనం సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో అది అతడి మూడో వేగవంతమైన ఫిఫ్టీగా నమోదైంది.
మరిన్ని వార్తలు చదవండి: కేకేఆర్ వదిలేసింది… వెంటనే కొత్త లీగ్ను ప్రకటించిన సీనియర్ క్రికెటర్!