కేకేఆర్ వదిలేసింది… వెంటనే కొత్త లీగ్ను ప్రకటించిన సీనియర్ క్రికెటర్!

కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ మోయిన్ అలీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీ తనను విడుదల చేయడంతో, ఇకపై ఐపీఎల్కి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. రాబోయే సీజన్ వేలంలో కూడా తన పేరు నమోదు చేయలేదు.
కేకేఆర్ వద్దనుకోవడంతో కొంత మనస్థాపం చెందినట్టుగా కనిపిస్తున్న మొయిన్, ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడిస్తూ, PSL 2026కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.
మోయిన్ అలీ పీఎస్ఎల్లో చివరిసారిగా 2020లో ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడాడు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత అతను మళ్లీ ఈ లీగ్లో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు కేకేఆర్ మొయిన్తో సహా పలువురు ప్రముఖ ఆటగాళ్లను విడుదల చేసింది.
ఆ జాబితాలో టీ20 దిగ్గజం ఆండ్రే రసెల్ కూడా ఉండటం సంచలనమే. అదేవిధంగా, గత సీజన్ వేలంలో రూ. 23.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ను కూడా ఫ్రాంచైజీ వదిలేసింది. వీళ్లతో పాటు టీ20 స్పెషలిస్టులు అయిన క్వింటన్ డికాక్, స్పెన్సర్ జాన్సన్, ఎన్రిచ్ నోర్జే, రహ్మానుల్లా గుర్బాజ్ వంటి పేర్లను కూడా కేకేఆర్ వేలానికి వదిలింది.
మొయిన్ను వదిలేయడం ఆశ్చర్యమా?
వాస్తవానికి మొయిన్ అలీని విడుదల చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. వయస్సు పెరిగిన కొద్దీ అతని ప్రదర్శనలో స్థిరత్వం తగ్గింది. గత సీజన్లో లభించిన అవకాశాలను కూడా ఆయన పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రసెల్ లాంటి సూపర్స్టార్ను కూడా వదిలేసిన కేకేఆర్కి మొయిన్ను సాగనంపడం పెద్ద సమస్య కాలేదు.
మరిన్ని వార్తలు చదవండి: IND vs SA 2nd ODI: సౌతాఫ్రికాకు పెద్ద బూస్ట్! బవుమా–మహారాజ్ రీ ఎంట్రీతో జట్టు బలపడింది
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.