IPL

Ranji Trophy 2025–26 Hyderabad Squad Announced Mohammed Siraj Named Captain

by Krishna R

రంజీ ట్రోఫీ 2025–26 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసింది.

హైదరాబాద్ జట్టు జనవరి 22న ముంబైతో, జనవరి 29న ఛత్తీస్‌గఢ్‌తో తలపడనుంది. ప్రస్తుతం సిరాజ్‌కు జాతీయ విధులు లేకపోవడంతో రంజీ మ్యాచ్‌ల్లో పాల్గొననున్నాడు. ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. రాహుల్ సింగ్ ఉప కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఈ జట్టులో తనయ్ త్యాగరాజన్, కె రోహిత్ రాయుడు వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు స్థానం లభించింది. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న అమన్ రావ్ పేరాల కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

హైదరాబాద్ జట్టు ఈ కీలక మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకుంది. సిరాజ్ నాయకత్వంలో జట్టు మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

హైదరాబాద్ జట్టు సభ్యులు

మహ్మద్ సిరాజ్, రాహుల్ సింగ్, సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, కె రోహిత్ రాయుడు, కె హిమతేజ, వరుణ్ గౌడ్, ఎం అభిరత్ రెడ్డి, రాహుల్ రాధేష్, అమన్ రావ్ పేరాల, రక్షణ్ రెడ్డి, నితిన్ సాయి యాదవ్, నితీశ్ రెడ్డి, సాయి ప్రగ్నయ్ రెడ్డి, బి పున్నయ్య

మరిన్నివార్తలుచదవండిముంబై ఇండియన్స్ ఫ్యామిలీలోకి సామ్ కర్రన్, విల్ జాక్స్, డ్యానీ వ్యాట్ హాడ్జ్