RCB Ownership Transfer: Will the Name Change? Here’s the Final Answer
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భారీ మార్పులకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఫ్రాంచైజీ చెన్నై కాదు బెంగళూరు జట్టు అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం మారింది. పురుషుల జట్టు మాత్రమే కాకుండా మహిళల జట్టును కూడా కలిపి ఈ ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్, బ్లాక్స్టోన్, డేవిడ్ బ్లిట్జర్కు చెందిన బోల్ట్ వెంచర్స్ కలిసి కొనుగోలు చేశాయి. ఈ ఒప్పందం విలువ సుమారు ₹16,705 కోట్లుగా ఉండడం విశేషం.
ఈ భారీ డీల్ తర్వాత అభిమానుల్లో పెద్ద చర్చకు కారణమైన అంశం జట్టు పేరుపై మార్పు ఉంటుందా అన్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అనే పేరు అభిమానుల్లో ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధాన్ని కలిగించింది. సంవత్సరాలుగా ఈ జట్టు తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది.
ఇంతకుముందు ఐపీఎల్లో కొన్ని జట్లు తమ పేర్లు మార్చుకున్న ఉదాహరణలు ఉన్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పంజాబ్ కింగ్స్గా మారింది. అలాగే ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్గా మారింది. దీంతో ఆర్సీబీ కూడా పేరును మార్చవచ్చనే ఊహాగానాలు వినిపించాయి.
పేరు మార్పు ఊహాగానాలకు అనన్య బిర్లా ఫుల్ స్టాప్
అయితే ఆ ఊహాగానాలకు ముగింపు పలుకుతూ ఆదిత్య బిర్లా కుటుంబానికి చెందిన అనన్య బిర్లా స్పష్టత ఇచ్చింది. జట్టు పేరు యథాతథంగా కొనసాగుతుందని ఆమె తెలిపింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరు అలాగే కొనసాగుతుందని ఆమె వెల్లడించింది.
ఈ ఒప్పందాన్ని పూర్తిచేయడానికి మార్చి 31ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఇంకా ఇది పూర్తిగా అధికారికంగా అమలులోకి రాలేదు. దీనికి భారత క్రికెట్ నియంత్రణ మండలి అనుమతి అవసరం ఉంది.
సాధారణంగా ఇలాంటి ఆమోదాలు వార్షిక సాధారణ సమావేశంలో తీసుకుంటారు. గత సంవత్సరం ఈ సమావేశం సెప్టెంబర్లో జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా జరిగితే, కొత్త యాజమాన్యం అధికారికంగా బాధ్యతలు చేపట్టడానికి 2026 అక్టోబర్ వరకు వేచి చూడాల్సి రావచ్చు. అప్పటివరకు జట్టు తన ప్రస్తుత పేరుతోనే కొనసాగుతుంది.
ప్రారంభ మ్యాచ్లకు కమిన్స్ దూరం.. సన్రైజర్స్ హైదరాబాద్ భారీ షాక్