IPL

T20 World Cup 2026 Full Groups: Teams, Venues & Format – Everything You Need to Know

by Krishna R

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్‌కి సంబంధించిన గ్రూపుల వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినా, దాదాపు ఖరారైనట్టే కనిపిస్తున్నాయి. మొత్తం 20 జట్లతో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో, ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉండేలా నాలుగు గ్రూపులను రూపొందించారు.

[ Poll: BZKXJawx ]

ఇందులో ఆతిథ్య దేశమైన భారత్‌కి సులభమైన గ్రూప్ దక్కగా, సహ ఆతిథ్య శ్రీలంక మాత్రం కఠినమైన సవాల్‌ను ఎదుర్కోనుంది.

గ్రూప్ A – భారత గ్రూప్

భారత్, పాకిస్తాన్, యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్

ఆతిథ్య హోదాలో ఉన్న టీమిండియా గ్రూప్ Aలో చేరగా, అదే గ్రూప్‌లో ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా ఉంది. ఈ గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్ మాత్రమే టెస్ట్ హోదా కలిగిన జట్లు. యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్‌ జట్లు తక్కువ అనుభవం కలిగినవిగా భావించబడుతున్నాయి.

అందువల్ల భారత్, పాకిస్తాన్‌లు సూపర్ 8కి చేరే అవకాశాలు మరింత బలంగా ఉన్నాయి. అంతేకాక, గ్రూప్ దశలోనే జరిగే భారత్ vs పాకిస్తాన్ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు.

శ్రీలంకకు ‘గ్రూప్ ఆఫ్ డెత్’

సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకను గ్రూప్ Bలో ఉంచగా, ఈ గ్రూప్‌ను “గ్రూప్ ఆఫ్ డెత్” అని చెప్పవచ్చు.
ఈ గ్రూప్‌లో ఉన్న జట్లు:
శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్

ఈ గ్రూప్‌లో నాలుగు టెస్ట్ జట్లు ఉండటం, అలాగే జట్లు అన్నీ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో ఉండటం వల్ల, శ్రీలంకకు సూపర్ 8 దశకు చేరడం కఠిన సవాలే.

మిగిలిన గ్రూపులు – పోటీ తీవ్రం

గ్రూప్ C:

ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇటలీ, నేపాల్

గ్రూప్ D:

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడా

టోర్నమెంట్ ఫార్మాట్ ప్రకారం, ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. అనంతరం ఈ ఎనిమిది జట్లను మరో రెండు గ్రూపులుగా విడగొట్టి, టాప్ 2 జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి.

సూపర్ 8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మ్యాచ్ వేదికలు & ఫైనల్

టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు భారత్ మరియు శ్రీలంకలోని ఏడు నగరాల్లో జరుగుతాయి.

భారత్‌లో మ్యాచ్‌లు జరుగు నగరాలు:

  • ముంబై

  • కోల్‌కతా

  • చెన్నై

  • ఢిల్లీ

  • అహ్మదాబాద్

హైదరాబాద్‌ను ఈ జాబితాలో చేర్చలేదు.

శ్రీలంకలో వేదికలు:

  • కొలంబో

  • క్యాండీ

ఫైనల్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించాలని యోచిస్తున్నారు. ఒక సెమీ-ఫైనల్‌ను కొలంబోలో జరపవచ్చు, కాని అది పాకిస్తాన్ లేదా శ్రీలంక సెమీస్‌కి చేరితేనే సాధ్యమవుతుంది.

మరిన్ని వార్తలు చదవండి:  ఐపీఎల్ 2026 రిటెన్షన్ పూర్తైంది: ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత పర్స్ మనీ ఉంది? పూర్తి లిస్ట్