T20 World Cup 2026: West Indies Announce 15-Member Squad, Shai Hope to Lead

భారత్, శ్రీలంక వేదికగా త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం వెస్టిండీస్ 15 మంది సభ్యుల జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించింది. జట్టుకు కెప్టెన్గా షాయ్ హోప్ కొనసాగనుండగా, సంచలన ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ మరియు 25 ఏళ్ల గయానీస్ బ్యాటర్ క్వెంటిన్ సాంప్సన్ జట్టులో చోటు పొందారు.
మాజీ కెప్టెన్లు జేసన్ హోల్డర్, రోవ్మన్ పావెల్ కూడా జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. పేసర్లుగా మాథ్యూ ఫోర్డ్, జేడెన్ సీల్స్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. స్పిన్ విభాగంలో ఆకీల్ హొసేన్, రోస్టన్ చేజ్, గుడకేశ్ మోటీ తాము ఎంపికయ్యారు. ఆల్రౌండర్ విభాగంలో విధ్వంసకర బ్యాటర్ రొమారియో షెపర్డ్ అవకాశాలు పొందారు. గాయాల కారణంగా ఎవిన్ లూయిస్ మరియు అల్జరీ జోసెఫ్ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.
మొత్తంగా, గత ఎడిషన్లో ఆడిన 11 మంది ఆటగాళ్లు ఈసారి కూడా జట్టులో కొనసాగుతున్నారు.
వెస్ట్ఇండీస్ ప్రపంచకప్లో గ్రూప్ Cలో ఉంది. ఈ గ్రూప్లో మిగతా జట్లు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నేపాల్, మరియు ఇటలీ ఉన్నాయి. విండీస్ ఫిబ్రవరి 7న కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో స్కాట్లాండ్పై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదే వేదికలో వారు చివరిసారి వరల్డ్కప్ గెలిచారు.
టీ20 ప్రపంచకప్ 2026 – వెస్ట్ఇండీస్ జట్టు:
షాయ్ హోప్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, క్వెంటిన్ సాంప్సన్, ఆకీల్ హొసేన్, గుడకేశ్ మోటీ, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్
మరిన్నివార్తలుచదవండి: యశస్వి జైస్వాల్పై ఎంసీఏ ఆగ్రహం.. ఢిల్లీ మ్యాచ్కు ఎంపిక చేయని ముంబై సెలక్టర్లు