యశస్వి జైస్వాల్పై ఎంసీఏ ఆగ్రహం.. ఢిల్లీ మ్యాచ్కు ఎంపిక చేయని ముంబై సెలక్టర్లు

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడి తీరుతో ముంబై క్రికెట్ అసోసియేషన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. జాతీయ జట్టు విధుల్లో లేని సమయంలో దేశీ క్రికెట్లో తప్పనిసరిగా పాల్గొనాలని బీసీసీఐ ఇప్పటికే ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలకు అనుగుణంగా విరాట్ కోహ్లి ఢిల్లీ తరఫున, రోహిత్ శర్మ ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొని సత్తా చాటారు. యశస్వి జైస్వాల్ కూడా ఈ టోర్నీలో ముంబై తరఫున రెండు మ్యాచ్లు ఆడాడు.
ప్రస్తుతం ముంబై జట్టు రంజీ ట్రోఫీ 2025-26 రెండో దశ మ్యాచ్లతో బిజీగా ఉంది. హైదరాబాద్తో ఇటీవల ముగిసిన మ్యాచ్లో ముంబై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. తదుపరి మ్యాచ్లో సొంత మైదానంలో ఢిల్లీ జట్టుతో తలపడనుంది.
ఈ మ్యాచ్కు ముందు కెప్టెన్ శార్దూల్ ఠాకూర్తో పాటు అనుభవజ్ఞుడు అజింక్య రహానే వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్కు యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉంటాడా అనే విషయంపై ఎంసీఏ సెలక్టర్లు అతడిని సంప్రదించారు. అయితే అతడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎంసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ అంశంపై ఒక ఎంసీఏ అధికారి మాట్లాడుతూ, హైదరాబాద్ మ్యాచ్ సమయంలో కూడా జైస్వాల్ను సంప్రదించామని, కానీ అప్పుడూ స్పందన రాలేదని తెలిపారు. తనకు నచ్చిన మ్యాచ్లకే ఆడాలని అతడు భావిస్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు.
తదుపరి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా అని మళ్లీ అడిగినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఢిల్లీతో మ్యాచ్కు అతడిని ఎంపిక చేయడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంసీఏ పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సిద్ధేశ్ లాడ్ కెప్టెన్సీలో ఉన్న ఈ జట్టులో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
మరిన్నివార్తలుచదవండి: టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ షెడ్యూల్ జనవరి 26న విడుదల భారత్ దక్షిణాఫ్రికాతో ప్రాక్టీస్ మ్యాచ్
తరచుగా అడిగే ప్రశ్నలు
ఎంసీఏ సెలక్టర్లు పలుమార్లు సంప్రదించినప్పటికీ జైస్వాల్ నుంచి స్పందన రాలేదు. అందుకే అతడిని జట్టులోకి తీసుకోలేదు.
ముంబై జట్టు రంజీ ట్రోఫీ నాకౌట్ దశలో ఢిల్లీ జట్టుతో సొంత మైదానంలో తలపడనుంది.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.