WPL Auction 2025 Updated Team Squads After 12 Sets Completed

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నాల్గవ ఎడిషన్ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5, 2026 వరకు జరగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, అలాగే వడోదర ఈ సీజన్కు ఆతిథ్య వేదికలుగా ఎంపికయ్యాయి. ఫిబ్రవరి 5న జరిగే గ్రాండ్ ఫైనల్తో ఈ సీజన్ ముగిసేలా షెడ్యూల్ ఖరారైంది. దేశవ్యాప్తంగా దాదాపు ఒక నెలపాటు ఎలైట్ మహిళల టీ20 క్రికెట్కు వేదిక కానుంది. ఇదిలా ఉండగా, తాజాగా ముగిసిన డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో ఎన్నో అంచనాలకు విరుద్ధంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ మెగా వేలంలో అభిమానుల దృష్టి మొత్తం మార్క్యూ ఆటగాళ్లపైనే నిలిచింది. ఎనిమిది మంది మార్క్యూ ప్లేయర్ల జాబితాలో ఇద్దరు భారత క్రికెటర్లు — దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్ — కూడా ఉండడం విశేషం. కొత్త ఆటగాళ్లు జట్లకు చేరడంతో అన్ని ఫ్రాంఛైజీలు భారీగా మారిపోయాయి. ఇప్పటి వరకు 12 సెట్లు పూర్తయ్యాయి. వాటితో టీంలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
12 సెట్లు ముగిసిన తర్వాత జట్ల ప్రస్తుత జాబితా
వేలం ప్రారంభమైన రెండున్నర గంటల్లోనే మొత్తం 73 స్థానాల్లో 27 స్థానాలు భర్తీ అయ్యాయి. ఇక మిగిలిన 46 స్థానాల కోసం బిడ్డింగ్ కొనసాగనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, అన్నాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, నికి ప్రసాద్, లారా వోల్వార్డ్ట్, చినెల్లె హెన్రీ, శ్రీ చరణి, స్నేహ రాణా, లిజెల్ లీ, డియా యాదవ్
గుజరాత్ జెయింట్స్ (GG)
ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ, సోఫీ డివైన్, రేణుకా సింగ్, భారతీ ఫుల్మాలి, టిటాస్ సాధు
ముంబై ఇండియన్స్ (MI)
నాట్ స్కైవర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, అమన్జోత్ కౌర్, జి. కమలినీ, అమేలియా కెర్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
స్మృతి మంధాన, రిచా ఘోష్, శ్రేయంక పటిల్, ఎలిస్ పెర్రీ, జార్జియా వోల్, నాడిన్ డి క్లెర్క్, రాధా యాదవ్, లారెన్ బెల్, లిన్సే స్మిత్, ప్రేమ రావత్
యూపీ వారియర్స్ (UPW)
శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్ఫీల్డ్, కిరణ్ నవ్గిరే, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్, ఆశా శోభన
మరిన్ని వార్తలు చదవండి: WPL 2026 Auction: మెగా వేలంలో సంచలనాలు! యూపీ వారియర్స్ ఖర్చు చేసిన కోట్లతో షాక్