WPL 2026 Auction: మెగా వేలంలో సంచలనాలు! యూపీ వారియర్స్ ఖర్చు చేసిన కోట్లతో షాక్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ మెగా వేలం గురువారం (నవంబర్ 27) ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. మెగా వేలం కావడంతో స్టార్ క్రికెటర్లపై భారీ ఆసక్తి నెలకొంది. మొత్తం 277 మంది మహిళా క్రికెటర్లు వేలం బరిలోకి వచ్చారు. అందులో 73 స్థానాల కోసం ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఈ జాబితాలో 194 మంది భారత క్రికెటర్లు ఉండగా, వారిలో 52 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 142 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు.
ముంబై, బెంగుళూరు, గుజరాత్, ఢిల్లీ, యూపీ, ఈ ఐదు ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలపర్చుకోవడానికి వేలంలో పాల్గొంటున్నాయి.
దీప్తి శర్మపై భారీ బిడ్డింగ్
ఇప్పటి వరకు జరిగిన వేలంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మపై ఘనమైన పోటీ నెలకొంది. చివరకు యూపీ వారియర్స్ ఆమెను రూ. 3.2 కోట్ల భారీ ధరకు తమ జట్టులోకి తీసుకున్నారు. ప్రత్యేకంగా చెప్పాల్సిందేంటే, వరల్డ్ కప్లో అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన (215 పరుగులు, 22 వికెట్లు) చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచినా, గత సీజన్ తర్వాత యూపీ వారియర్స్ ఆమెను రిటైన్ చేయలేదు. డబ్ల్యూపీఎల్ గత ఎడిషన్లోనూ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అయ్యినా ఫ్రాంచైజీ కరుణ చూపలేదు.
అయితే ఇప్పుడు అదే జట్టు ఆమెను రికార్డు ధరకే కొనుగోలు చేయడం ప్రత్యేక ఆసక్తికరం.
అమేలియా కెర్ – ముంబై ఇండియన్స్ భారీ కొనుగోలు
న్యూజిలాండ్ యువ ఆల్రౌండర్ అమేలియా కెర్ను ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. గత సీజన్ అనంతరం ఆమెను రిలీజ్ చేసిన ముంబై, ఈసారి మళ్లీ పెద్ద మొత్తంతో దక్కించుకుంది.
3 కోట్లకు సొంతం చేసుకుంది. గత సీజన్ అనంతరం ఆమెను రిలీజ్ చేసిన ముంబై, ఈసారి మళ్లీ పెద్ద మొత్తంతో దక్కించుకుంది.
మెగ్ లానింగ్ – యూపీ వారియర్స్ మరో సూపర్ సైన్
ఇటీవల బిగ్ బాష్ లీగ్లో మెరుపు సెంచరీ కొట్టిన మెగ్ లానింగ్ను యూపీ వారియర్స్ రూ. 1.9 కోట్లకి తీసుకున్నారు. వరుసగా మూడేళ్ల పాటు ఢిల్లీ జట్టును ఫైనల్కు చేర్చిన కెప్టెన్ అయిన లానింగ్ను, ఆశ్చర్యకరంగా ఢిల్లీ ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది.
శ్రీ చరణిపై ఢిల్లీ క్యాపిటల్స్ పెద్ద బిడ్
భారత ఆఫ్-స్పిన్నర్ శ్రీ చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె మంచి ఫారమ్ను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ బలమైన బిడ్ వేసింది.
సోఫీ డివైన్ – గుజరాత్కు కీలక ప్లేయర్
గత సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడిన సీనియర్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ను గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు దక్కించుకుంది.
సోఫీ ఎక్లెస్టోన్ & లిచ్ఫీల్డ్ – యూపీ వరుసగా సైన్ చేసిన స్టార్లు
ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ను కూడా యూపీ వారియర్స్ జట్టు సొంతం చేసుకుంది. అదేవిధంగా, వరల్డ్ కప్ ఫైనల్లో భారత్పై సెంచరీతో మెరిసిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఫీబీ లిచ్ఫీల్డ్ను రూ. 1.2 కోట్లకు కొనుగోలు చేశారు.
మరిన్ని వార్తలు చదవండి: T20 వరల్డ్ కప్ 2026: పాకిస్థాన్ కాదు, ఆ జట్టునే ఫైనల్లో ఓడించాలని టీమిండియా కెప్టెన్ వ్యాఖ్యలు
I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.