అంబటి రాయుడు మరోసారి తండ్రి... మగ బిడ్డతో కుటుంబంలో ఆనందం

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. రాయుడు మరోసారి తండ్రిగా మారాడు. ఆయన భార్య చెన్నుపల్లి విద్య మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని రాయుడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
తల్లి, నూతనంగా జన్మించిన బిడ్డతో కలిసి తీసుకున్న సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ, మగ బిడ్డతో ఆశీర్వదించబడినందుకు ఎంతో ఆనందంగా ఉందని రాయుడు పేర్కొన్నాడు. ఈ పోస్ట్ వెలువడిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు, క్రికెట్ ప్రపంచానికి చెందిన పలువురు రాయుడుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. మాజీ టీమిండియా సహచరులు శిఖర్ ధవన్, హర్భజన్ సింగ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న రాయుడుకు ఇది మూడో సంతానం. ఇప్పటికే ఆయనకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. అంబటి రాయుడు–చెన్నుపల్లి విద్య దంపతులు 2009లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
రాయుడు క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, 2013లో వన్డే ఫార్మాట్ ద్వారా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. స్టయిలిష్ బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్న రాయుడు, భారత్ తరఫున 55 వన్డేలు, 6 టీ20 మ్యాచ్లు ఆడి, 3 సెంచరీలు, 10 అర్ధ శతకాలతో కలిసి 1700కు పైగా పరుగులు సాధించాడు. అంతర్జాతీయ కెరీర్ కంటే ఐపీఎల్లో అతని ప్రదర్శన మరింత ప్రత్యేకంగా నిలిచింది. 204 ఐపీఎల్ మ్యాచ్ల్లో ఒక సెంచరీ, 22 అర్ధ శతకాల సాయంతో 4348 పరుగులు చేసి తన సత్తా చాటాడు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా పేరొందిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో రాయుడు కీలక పాత్ర పోషించాడు. 2023లో ఐపీఎల్తో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెబుతూ అభిమానులకు వీడ్కోలు పలికాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వాసి అయిన రాయుడు, దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్, ఆంధ్ర జట్లకు ప్రాతినిధ్యం వహించి తనదైన ముద్ర వేశాడు.
यह भी पढ़ें:
తరచుగా అడిగే ప్రశ్నలు
అంబటి రాయుడుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడ పిల్లలు, తాజాగా ఒక మగ బిడ్డ.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.