18 ఏళ్ల ఆయుష్ మాత్రే సంచలనం: రోహిత్ శర్మ 18 ఏళ్ల రికార్డ్ బ్రేక్!

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యువ సెన్సేషన్ ఆయుష్ మాత్రే చరిత్రలో అరుదైన రికార్డ్ సృష్టించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డ్ను తిరగరాశాడు. దేశవాళీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో ఫస్ట్క్లాస్, లిస్ట్-ఏ, టీ20 సెంచరీలు బాదిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ 2025లో శతకం నమోదు చేసి ఈ ఘనత సాధించాడు.
ఈ టోర్నీలో ముంబై తరఫున ఆడుతున్న ఆయుష్ మాత్రే… విదర్భతో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని సెంచరీతో ముంబై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే ఫస్ట్క్లాస్, లిస్ట్-ఏలో సెంచరీలు చేసిన ఆయుష్… ఇప్పుడు టీ20లోనూ శతకం బాదడంతో, రోహిత్ శర్మ పేరిట ఉన్న అరుదైన రికార్డును అధిగమించాడు.
రోహిత్ శర్మ మూడు ఫార్మాట్ల దేశవాళీ క్రికెట్లో సెంచరీలు బాదినప్పుడు ఆయన వయసం 19 సంవత్సరాలు 339 రోజులు. అయితే ఆయుష్ మాత్రే కేవలం 18 సంవత్సరాలు 135 రోజులు ఉన్నప్పుడే ఈ ఫీట్ సాధించాడు. రోహిత్ 2007లో ముంబై తరఫున దేశవాళీ టీ20ల్లో శతకం బాదడంతో ఆ రికార్డ్ ఏర్పడింది. దాదాపు 18 ఏళ్లుగా ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఆ మైలురాయిని ఆయుష్ మాత్రే ఇప్పుడు అధిగమించాడు.
లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ 20 ఓవర్లలో 9 వికెట్లకు 192 పరుగులు చేసింది. అథర్వ టైడ్ (64), అమన్ మోఖడే (61) అర్థసెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో సాయిరాజ్ పాటిల్, శివమ్ దూబే చెరో మూడు వికెట్లు, అథర్వ అంకోలేకర్ రెండు వికెట్లు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీసారు.
తదుపరి చెసింగ్లో ముంబై 17.5 ఓవర్లలోనే 3 వికెట్లకు 194 పరుగులు చేసి మ్యాచ్ను వన్సైడ్గా గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (35), శివమ్ దూబే (39) కీలక ఇన్నింగ్స్ ఆడారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే, పార్థ్ రెఖడే, యష్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.
మరిన్ని వార్తలు చదవండి: WPL 2026 Schedule: WPL 2026 ధమాకా! తొలి మ్యాచ్నే MI vs RCB..షెడ్యూల్ చూసి అభిమానులు షాక్!
I am Guna SRV, a dedicated IPL and cricket journalist committed to delivering accurate, insightful, and engaging coverage for Telugu readers. My work focuses on match analysis, player form, tactical trends, and breaking developments, all presented with clarity and authority.