అన్ని

IND vs NZ: వాషింగ్టన్ సుందర్ గాయం.. టీమిండియా జట్టులో యువ ఆటగాడు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ మధ్యలో టీమిండియాకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కీలక ఆటగాడు కూడా గాయంతో జట్టును వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వడోదర వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ సందర్భంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు పక్కటెముకల వద్ద గాయం అయ్యింది. మ్యాచ్ సమయంలో నొప్పితో ఇబ్బంది పడిన వాషీని వెంటనే స్కానింగ్‌కు పంపించారు. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండగా, పూర్తి వైద్య నివేదిక వెలువడే వరకు అతడి పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.

అయితే గాయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాషింగ్టన్ సుందర్‌ను మిగిలిన రెండు వన్డే మ్యాచ్‌లకు దూరంగా ఉంచాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. అతని స్థానంలో యువ క్రికెటర్ ఆయుష్ బదోనిని భారత జట్టులోకి ఎంపిక చేశారు. రాజ్‌కోట్‌లో జరగనున్న రెండో వన్డేకు ముందే బదోని టీమిండియాతో చేరనున్నాడు.

ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయుష్ బదోనికి ఇది జాతీయ జట్టులో తొలి ఎంపిక. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనలతో ఆకట్టుకున్న బదోనికి ఇప్పుడు టీమిండియా తరఫున ఆడే అరుదైన అవకాశం దక్కింది.

మరిన్ని వార్తలు చదవండి: విరాట్ కోహ్లీ మరో చరిత్ర 28000 పరుగులు పూర్తి చేసి అమ్మపై ప్రేమను చాటిన స్టార్

LastModified Date: 2026-01-12 19:09:38

తరచుగా అడిగే ప్రశ్నలు

Q. వాషింగ్టన్ సుందర్‌కు ఏమైంది?
A.

తొలి వన్డే మ్యాచ్ సమయంలో అతనికి పక్కటెముకల వద్ద గాయం అయింది.

Krishna R
Krishna R

I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.

నవీకరణలు