అన్ని

IND vs SA 2nd T20I: ఒక్క ఓవర్‌లో 7 వైడ్‌లు! అర్షదీప్ భారీ తడబాటు – గంభీర్ ఆగ్రహం

సౌతాఫ్రికా తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ పూర్తిగా లయ తప్పాడు. గురువారం చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అతడు వేసిన ఓవర్ టీమిండియాకు బాగా ఖరీదు అయ్యింది.

తొలి రెండు ఓవర్లలోనే 20 పరుగులు ఇవ్వడం అతని పేసింగ్‌పై ప్రశ్నలు తెరలేపింది. అయితే 11వ ఓవర్‌లో జరిగిన ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క ఓవర్‌లోనే ఏకంగా 7 వైడ్ బాల్స్ వేసి సఫారీ బ్యాటర్లకు అనవసర పరుగులు అందించాడు.

11వ ఓవర్ కోసం సూర్యకుమార్ అర్షదీప్‌కు బంతిని అందించాడు. ఆ ఓవర్ మొదటి బంతినే డికాక్ సిక్సర్‌గా పంపడంతో పేసర్‌పై ఒత్తిడి పెరిగింది. వెంటనే వరుసగా రెండు వైడ్‌లు, ఆ తర్వాత బంతి వేయడానికి ముందే మరో నాలుగు వైడ్ బాల్స్, ఇలా మొత్తం అయోమయం సృష్టించాడు.

చివరి బంతికి ముందు మరో వైడ్ వేయడంతో అర్షదీప్ ఒక్క ఓవర్ పూర్తి చేయడానికి 13 బాల్స్ వేశాడు. తన ఆరుగురు లెగల్ డెలివరీలకే 11 పరుగులు ఇవ్వగా, వైడ్‌ల రూపంలో మరో 7 పరుగులు ఇచ్చి ఆ ఓవర్‌ మొత్తం 18 పరుగులు .

అర్షదీప్ వరుసగా వైడ్‌లు విసరడం చూసి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ డగౌట్‌లో స్పష్టంగా ఆగ్రహం ప్రదర్శించాడు. ఇప్పటివరకు అర్షదీప్ వేసిన మూడు ఓవర్లలో 38 పరుగులు నమోదయ్యాయి.

మ్యాచ్ పరిస్థితికి వస్తే సౌతాఫ్రికా భారీ స్కోర్ వైపు దూసుకుపోతోంది. 12 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ అద్భుత ఫామ్‌లో 71 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అతనితో కలిసి మార్కరం 29 పరుగులు చేసి జట్టుకు మంచి సహకారం అందించాడు. భారత బౌలర్లలో ఇప్పటివరకు రెండు వికెట్లు వరుణ్ చక్రవర్తి తీసుకున్నాడు.

మరిన్ని వార్తలు చదవండి: టీ20 వరల్డ్ కప్ 2026: ఇండియా–పాక్ మ్యాచ్ తేదీ, టికెట్ ధరలు, మ్యాచ్ వేదికలు

LastModified Date: 2025-12-11 23:18:24
Krishna R
Krishna R

I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.

నవీకరణలు