
సౌతాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను గెలుచుకుని టీమిండియా ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. ఇక వచ్చే ఏడాదిలోనే భారత జట్టు తదుపరి అంతర్జాతీయ సిరీస్ను ఆడనుంది. జనవరి 11 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా, జనవరి 21 నుంచి ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు ముందు ఇదే చివరి టీ20 సిరీస్ కావడం విశేషం. ఈ కారణంగా ఈ సిరీస్లపై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లకు దాదాపు 20 రోజుల విశ్రాంతి లభించింది. ప్రస్తుతం ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఇందులో కొందరు విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొననుండగా, మరికొందరు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు.
మూడు వన్డేల సిరీస్ వివరాలు
న్యూజిలాండ్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నారు. తొలి వన్డే జనవరి 11న వడోదర వేదికగా జరుగనుండగా, రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్లో, మూడో వన్డే జనవరి 18న ఇండోర్లో నిర్వహించనున్నారు. ఈ మూడు వన్డే మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి.
జనవరి 21 నుంచి టీ20 సిరీస్
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభం కానుంది. జనవరి 21న నాగ్పూర్లో తొలి టీ20, జనవరి 23న రాయ్పూర్లో రెండో టీ20, జనవరి 25న గువహతిలో మూడో టీ20, జనవరి 28న విశాఖపట్నంలో నాలుగో టీ20, జనవరి 31న తిరువనంతపురంలో ఐదో టీ20 మ్యాచ్లు జరగనున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026కు ముందు టీమిండియా ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే కావడంతో దీనిపై అభిమానుల్లో ప్రత్యేక ఉత్సుకత నెలకొంది. టీ20 ప్రపంచకప్ 2025 కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టుతోనే ఈ సిరీస్ను భారత్ ఆడనుంది. వన్డే సిరీస్కు సంబంధించిన జట్టును మాత్రం ఇంకా ప్రకటించలేదు.
భారత టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
మరిన్ని వార్తలు చదవండి: విరాట్ కోహ్లీనా? జో రూట్నా? 2025 ODI బెస్ట్ ప్లేయర్ ఎవరో చూస్తే షాక్ అవుతారు!