IPL 2026 మినీ వేలం: సన్రైజర్స్ హైదరాబాద్ నిరాశాజనక ప్రదర్శన, రూ.25.5 కోట్ల పర్స్ వృథా?

ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసింది. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన ఈ మినీ ఆక్షన్లో రూ.25.5 కోట్ల భారీ పర్స్తో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ, ఆశించిన స్థాయిలో దూకుడుగా వ్యవహరించలేకపోయింది. ప్రధాన ఆటగాళ్లను ఇప్పటికే రిటైన్ చేసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్, వారికి సరైన బ్యాకప్ ప్లేయర్లను కొనుగోలు చేయడంలో విఫలమైంది. అంతేకాకుండా, గత సీజన్లో జట్టు వైఫల్యానికి కారణమైన బలహీనతలను కూడా ఈ వేలంలో పూర్తిగా పరిష్కరించలేకపోయింది.
ముఖ్యంగా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేయలేకపోవడం జట్టు పెద్ద లోటుగా మారింది. రూ.25.5 కోట్ల పర్స్ ఉన్నప్పటికీ స్పెషలిస్ట్ స్పిన్నర్ను తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. పేరున్న పలువురు ఆటగాళ్ల కోసం సన్రైజర్స్ కనీసం బిడ్ కూడా వేయలేదు. అందరూ ఊహించినట్లుగానే రవి బిష్ణోయ్ కోసం చివరి వరకు ప్రయత్నించిన ఆరెంజ్ ఆర్మీ, చివరకు చేతులెత్తేసింది. బిష్ణోయ్ కోసం రూ.7 కోట్ల వరకు బిడ్ వేసిన సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ రూ.7.20 కోట్లకు బిడ్ వేయడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
అదే సమయంలో అనామక ఆటగాళ్ల కోసం మాత్రం సన్రైజర్స్ తీవ్రంగా ప్రయత్నించింది. స్పిన్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్, వికెట్కీపర్ కమ్ బ్యాటర్ కార్తీక్ శర్మ, పేస్ ఆల్రౌండర్ అకీబ్ దార్ల కోసం పోటీపడి చివరకు వారిని దక్కించుకోలేకపోయింది. ఈ వేలంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొదట అన్సోల్డ్గా నిలిచిన లియామ్ లివింగ్స్టోన్ను చివరకు రూ.13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం.
ఈ మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న నిర్ణయాలు అభిమానులతో పాటు కామెంటేటర్లను కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. వేలంలో ఆశించిన స్థాయిలో ఆటగాళ్లను కొనుగోలు చేయకపోయినా, జట్టు కోర్ మాత్రం బలంగానే ఉంది. అయితే స్పెషలిస్ట్ ఇండియన్ పేసర్ మరియు నాణ్యమైన స్పిన్నర్ లోటు ఆరెంజ్ ఆర్మీకి స్పష్టంగా కనిపిస్తోంది. అనామక ఆటగాళ్లు ఈ రెండు కీలక స్థానాలను సమర్థంగా భర్తీ చేయగలిగితే, సన్రైజర్స్ హైదరాబాద్కు తిరుగుండే పరిస్థితి ఉండదు.
సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు
సలీల్ అరోరా (రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్ (రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా (రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్ (రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె (రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే (రూ.30 లక్షలు), అమిత్ కుమార్ (రూ.30 లక్షలు), లియామ్ లివింగ్స్టోన్ (రూ.13 కోట్లు), శివమ్ మావి (రూ.75 లక్షలు).
సన్రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసిన ఆటగాళ్లు
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ.
సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, లియామ్ లివింగ్స్టోన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనాద్కత్.
మరిన్ని వార్తలు చదవండి: KKR IPL 2026 స్క్వాడ్, అబుధాబి వేలం ఫలితాలు & టాప్ కొనుగోళ్లు
తరచుగా అడిగే ప్రశ్నలు
భారీ పర్స్ ఉన్నప్పటికీ స్పెషలిస్ట్ ఇండియన్ పేసర్, నాణ్యమైన స్పిన్నర్ను కొనుగోలు చేయలేకపోవడం, అలాగే కీలక బ్యాకప్ ప్లేయర్లు దక్కకపోవడం వల్ల సన్రైజర్స్ హైదరాబాద్ మినీ వేలంలో నిరాశపరిచింది.
ఈ మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేసిన అతిపెద్ద కొనుగోలు లియామ్ లివింగ్స్టోన్ను రూ.13 కోట్లకు దక్కించుకోవడంగా నిలిచింది.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.