Rohit-Virat: ఓవర్సీస్ టీ20 లీగ్స్ ఆడనున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ చైర్మన్ ఏమ్మన్నారంటే..?

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇతర దేశాల ఫ్రాంచైజీ టీ20 లీగ్లతో పోలిస్తే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా భారత ఆటగాళ్ల విషయంలో ఈ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం రిటైర్ కాకుండా ఉన్న ఏ భారత క్రికెటర్కైనా విదేశీ టీ20 లీగ్లలో ఆడేందుకు అనుమతి లేదు. ఈ కారణంగానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొనే ఏకైక ఫ్రాంచైజీ టీ20 టోర్నమెంట్గా ఐపీఎల్ నిలుస్తోంది.
ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో భారత ఆటగాళ్లు విదేశీ టీ20 లీగ్లలో ఆడే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ స్పష్టత ఇచ్చారు. టీమిండియా ఆటగాళ్లు ఓవర్సీస్ లీగ్లలో ఆడే అవకాశం భవిష్యత్తులోనూ ఉండదని ఆయన తేల్చి చెప్పారు. దీనికి ప్రధాన కారణంగా ఆటగాళ్లపై ఉండే అధిక వర్క్లోడ్ మేనేజ్మెంట్ను ఆయన పేర్కొన్నారు.
అలాగే, బీసీసీఐ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లు తప్పనిసరిగా దేశీయ క్రికెట్లో కూడా పాల్గొనాల్సి ఉంటుందని ధుమాల్ గుర్తు చేశారు. విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి దేశీయ టోర్నీల్లో ఆటగాళ్లు ఆడాల్సిందేనని తెలిపారు.
IPL Chairman on possibility top India players participating in foreign leagues . Interesting arguments by @ThakurArunS pic.twitter.com/FOxkk9AwGe
— Vimal कुमार (@Vimalwa) December 17, 2025
దేశంలోనే ఇప్పటికే చాలా బిజీ క్రికెట్ షెడ్యూల్ ఉండటం, అలాగే ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభించడం వల్ల విదేశీ లీగ్లలో ఆడే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయని ఆయన అన్నారు.
ఇక స్టార్ ఆటగాళ్లు విదేశీ లీగ్లలో పాల్గొనడం మరింత కష్టమని ధుమాల్ స్పష్టం చేశారు. కొంతమంది ఆటగాళ్లు టెస్టులు, వన్డేలు, టీ20లలో ఏదో ఒక ఫార్మాట్లో నిరంతరం ఆడుతూనే ఉంటారని, ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ లీగ్లకు వెళ్లడం అసాధ్యమని చెప్పారు. వర్క్లోడ్ నియంత్రణ అత్యంత కీలకమని నొక్కి చెప్పారు.
ప్రత్యేకించి బౌలర్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని ఆయన పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో రెండు టెస్టులు ఆడిన తర్వాతే బౌలర్లకు విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోందని, వన్డేలు, టీ20ల్లోనూ రొటేషన్ పాటించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి సమయంలో విదేశీ లీగ్లకు ఆడేందుకు అనుమతి ఇస్తే, అది జాతీయ జట్టుకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని ధుమాల్ స్పష్టంచేశారు.
మరిన్ని వార్తలు చదవండి: విరాట్ కోహ్లీపై నెటిజన్ల ఫైర్: ఇదేమి సంస్కారం? అంటూ ట్రోలింగ్
తరచుగా అడిగే ప్రశ్నలు
బీసీసీఐ నిబంధనలు మరియు ఆటగాళ్ల వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా అనుమతి లేదు.
ప్రస్తుతానికి ఆ అవకాశం లేదని ఐపీఎల్ చైర్మన్ స్పష్టం చేశారు.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.