రాజ్కోట్ వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సిరీస్ 1-1తో సమం

రాజ్కోట్ వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను బ్లాక్క్యాప్స్ జట్టు 1-1తో సమం చేసింది.
285 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కివీస్ జట్టు 47.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సులభంగా పూర్తి చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి తన క్లాస్ను చాటాడు. అజేయ శతకంతో మిచెల్ మ్యాచ్ను పూర్తిగా న్యూజిలాండ్ వైపు తిప్పాడు.
117 బంతులు ఎదుర్కొన్న మిచెల్ 11 ఫోర్లు, 2 సిక్స్ల సహాయంతో అజేయంగా 131 పరుగులు చేశాడు. అతడికి విల్ యంగ్ చక్కటి సహకారం అందించాడు. యంగ్ 98 బంతుల్లో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరి దశలో గ్లెన్ ఫిలిప్స్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 32 పరుగులు చేసి వేగంగా మ్యాచ్ ముగించాడు.
భారత బౌలర్లు ఈ మ్యాచ్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శించలేకపోయారు. కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా తలా ఒక్కో వికెట్ మాత్రమే సాధించారు.
రాహుల్ శతకం వృథా
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ అద్భుతమైన శతకంతో జట్టును నిలబెట్టగా, కెప్టెన్ శుభ్మన్ గిల్ అర్ధ శతకంతో రాణించాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టెన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టగా, జేమీసన్, పౌల్క్స్, బ్రేస్వెల్ తలా ఒక్కో వికెట్ సాధించారు.
సిరీస్ను నిర్ణయించే మూడో వన్డే మ్యాచ్ జనవరి 18న ఇండోర్ వేదికగా జరగనుంది.
మరిన్నివార్తలుచదవండి: అనుష్క శర్మ గాయంతో ముంబై ఇండియన్స్ మ్యాచ్కు దూరం, గుజరాత్ జెయింట్స్కు భారీ ఎదురుదెబ్బ
తరచుగా అడిగే ప్రశ్నలు
న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది.
మూడో వన్డే మ్యాచ్ జనవరి 18న ఇండోర్ వేదికగా జరగనుంది.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.