రోహిత్ శర్మ, హర్మన్ప్రీత్ కౌర్కు పద్మశ్రీ – విజయ్ అమృతరాజ్కు పద్మభూషణ్

2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ఇవాళ జనవరి ఇరవై ఐదున అధికారికంగా ప్రకటించింది. ఈసారి మొత్తం నూట ముప్పై ఒక మంది ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపికయ్యారు.
వీరిలో నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డు లభించగా, పదమూడు మందికి పద్మభూషణ్, ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్డులు అందనున్నాయి.
క్రీడారంగానికి చెందిన ఎనిమిది మందికి ఈసారి పద్మ అవార్డులు దక్కాయి. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్రాజ్కు అత్యున్నత గౌరవమైన పద్మవిభూషణ్ అవార్డు లభించింది.
Two exemplary leaders with incredible achievements 🇮🇳
— BCCI (@BCCI) January 25, 2026
Heartiest congratulations to #TeamIndia's World Cup-winning captains Rohit Sharma and Harmanpreet Kaur on being conferred with the prestigious Padma Shri Award🏅
A moment of pride for Indian Cricket 👏👏@ImRo45 |… pic.twitter.com/ntog7kpylY
అలాగే భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్, భారత సీనియర్ మహిళల హాకీ జట్టు గోల్కీపర్ సవిత పూనియా, బల్దేవ్ సింగ్, భగవాన్దాస్ రైక్వార్, కే పజనివేల్కు పద్మశ్రీ అవార్డులు లభించాయి.
దేశ క్రీడారంగ అభివృద్ధికి వీరు చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవం అందించారు.
మరిన్నివార్తలుచదవండి: షకీబ్ అల్ హసన్ రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్? బీసీబీ కీలక నిర్ణయం
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ సంవత్సరం మొత్తం నూట ముప్పై ఒక మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు.
టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్రాజ్కు పద్మవిభూషణ్ అవార్డు లభించింది.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.