పీఎస్ఎల్ 2026 సీజన్కు ముందుగా జట్లు ప్లాటినం కేటగిరీలో తమ కీలక ఆటగాళ్లను కొనసాగించాయి. ఈ జాబితాలో పేషావర్ జల్మీ నుంచి బాబర్ ఆజమ్, లాహోర్ ఖలందర్స్ నుంచి షాహీన్ షా అఫ్రిది, ఇస్లామాబాద్ యునైటెడ్ నుంచి షాదాబ్ ఖాన్, క్వెట్టా గ్లాడియేటర్స్ నుంచి అబ్రార్ అహ్మద్, కరాచీ కింగ్స్ నుంచి హసన్ అలీ ఉన్నారు. తమ తమ జట్లకు నాయకత్వం వహించే ఈ స్టార్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు మరోసారి నమ్మకం ఉంచాయి.
అయితే ముల్తాన్ సుల్తాన్స్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ జట్టు ప్లాటినం కేటగిరీలో ఒక్క ఆటగాడినీ కొనసాగించకపోవడమే కాకుండా, కెప్టెన్గా ఉన్న మహమ్మద్ రిజ్వాన్ను కూడా విడుదల చేసింది. కొత్త దిశలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇతర జట్ల విషయానికి వస్తే, పేషావర్ జల్మీ, లాహోర్ ఖలందర్స్, క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్ జట్లు ఒక్కొక్కటి నాలుగు మంది ఆటగాళ్లను కొనసాగించాయి. ఇస్లామాబాద్ యునైటెడ్ మాత్రం మూడు మందితో సరిపెట్టుకుంది. కొత్తగా పీఎస్ఎల్లోకి వచ్చిన సియాల్కోట్ స్టాలియన్జ్, హైదరాబాద్ జట్లు ఫిబ్రవరి 7లోపు తమ కొనసాగింపులను ప్రకటించనున్నాయి. పీఎస్ఎల్ చరిత్రలో తొలిసారి నిర్వహించనున్న వేలం ఫిబ్రవరి 11న జరగనుండటంతో, లీగ్పై ఆసక్తి మరింత పెరిగింది.