Shubman Gill Injury Update: రిహాబ్ ప్రారంభించిన భారత కెప్టెన్ – త్వరలోనే మైదానంలోకి?

టీమిండియాకు శుభవార్త. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం నుంచి కోలుకునే దిశగా కీలక అడుగు వేశాడు. మెడ గాయం కారణంగా గిల్ ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఇదే గాయం వల్ల అతడు సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ పాల్గొనలేకపోయాడు.
డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో గిల్ రిహాబిలిటేషన్ కార్యక్రమం ప్రారంభమైనట్లు తెలిసింది. ముంబైలో విస్తృత ఫిజియోథెరపీ పూర్తి చేసుకున్న గిల్, కొన్ని రోజులు కుటుంబంతో గడిపి ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.
వైద్యులు ఆయన కోసం ప్రత్యేక ఫిట్నెస్ ప్రోగ్రామ్ మరియు వర్క్లోడ్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. గాయం తర్వాత బ్యాటింగ్కు దూరంగా ఉన్న గిల్, త్వరలోనే తేలికపాటి నెట్ సెషన్లు ప్రారంభించే అవకాశం ఉంది.ఇటీవల చేసిన విమాన ప్రయాణాల్లో గిల్కు ఎలాంటి సమస్యలు లేకపోవడం వైద్య బృందాన్ని మరింత ఉత్సాహపరుస్తోంది.
డిసెంబర్ తొమ్మిదున ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్లో గిల్ ఆడతాడా లేదా అనేది రిహాబ్ కార్యక్రమంలో అతని ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే, తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు విరుచుకుపడ్డారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా అద్భుతంగా పోరాడినా చివరికి భారతదే పైచేయి అయింది. రెండో వన్డే డిసెంబర్ మూడు న రాయ్పూర్లో జరగనుంది.
మరిన్ని వార్తలు చదవండి: విరాట్ కోహ్లీ 52వ సెంచరీ: రికార్డులు రాసుకున్న కింగ్ కోహ్లీ – రోహిత్, గంభీర్ రియాక్షన్స్ వైరల్!
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.