T20 వరల్డ్ కప్ 2026: భారత్ సహా 6 జట్ల ప్రకటన.. కప్ కొట్టే డేంజరస్ స్క్వాడ్స్ ఇవే!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. భారత్లోని అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, చెన్నైతో పాటు శ్రీలంకలోని కొలంబో, క్యాండీ స్టేడియాలు ఈ ప్రపంచకప్ మ్యాచ్లకు వేదికలుగా నిలవనున్నాయి.
మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే పాకిస్థాన్ ఫైనల్కు చేరని పక్షంలోనే ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతుందని తెలుస్తోంది.
20 జట్లతో మహా సంగ్రామం
ఈసారి టీ20 ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఐదు జట్లు తలపడతాయి. ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంక నేరుగా అర్హత సాధించగా, మిగిలిన జట్లు గత ప్రపంచకప్ ప్రదర్శనతో పాటు క్వాలిఫయర్ మ్యాచ్ల ఆధారంగా టోర్నీలోకి వచ్చాయి.
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమ్ ఇండియా ఇప్పటికే తమ ప్రాథమిక స్క్వాడ్ను ప్రకటించింది. భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, శ్రీలంక జట్లు కూడా తమ జట్లను దాదాపుగా ఖరారు చేశాయి.
సూర్యకుమార్ నాయకత్వంలో టీమ్ ఇండియా
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత జరుగుతున్న తొలి ప్రపంచకప్ కావడంతో భారత జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. యువ ఆటగాళ్లైన అభిషేక్ శర్మ, తిలక్ వర్మకు చోటు దక్కగా, సంజు శాంసన్ మరియు ఇషాన్ కిషన్ వికెట్కీపర్లుగా ఎంపికయ్యారు.
టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.
ఆస్ట్రేలియా – మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, జేవియర్ బార్ట్లెట్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా, కూపర్ కొన్నోల్లీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్.
శ్రీలంక (ప్రాథమిక జట్టు) – దసున్ షనక (కెప్టెన్), వాహన్ అరాచ్చిగే, వాహన్ అరాచ్చిగే రత్నాయక్, నువాన్ తుషార, ఇషాన్ మలింగ, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కమిల్ మిషార, కుసల్ పెరీరా, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, జనిత్ లియానాగే, చరిత్ అసలంక, కమిందు మెండిస్, దిల్షన్ మదుశంక, మహేష్ తీక్షణ, దుషన్ హేమంత, విజయకాంత్ వ్యాస్కాంత్, ట్రెవిన్ మాథ్యూ, పవన్ రత్నాయకే, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ.
ఒమన్- జతీందర్ సింగ్ (కెప్టెన్), నదీమ్ ఖాన్, వినాయక్ శుక్లా, మహ్మద్ నదీమ్, హమ్మద్ మీర్జా, వసీమ్ అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, షకీల్ అహ్మద్, సుఫ్యాన్ మహమూద్, జే ఒడెదర, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితేన్ రమణాది, హస్నా అలీ, హస్నా.
ఇంగ్లాండ్ – హ్యారీ బ్రూక్ (కెప్టెన్), బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్,జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్.
ఆఫ్ఘనిస్తాన్ – రషీద్ ఖాన్ (కెప్టెన్), ఆర్జిమతుల్లా రసూలీ, ఇబ్రహీం జద్రాన్, నూర్ అహ్మద్, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్-ఉల్-హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నయీబ్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెదిఖుల్లా అటల్, ఫజల్హక్ ఫరూఖీ, అజ్మతుల్లాహ్ ఉమర్-అజ్మతుల్లా.
అత్యంత ప్రమాదకర గ్రూప్ ఏదంటే?
ఈసారి గ్రూప్ ఎ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇందులో భారత్, పాకిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. ముఖ్యంగా భారత్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది. మరోవైపు గ్రూప్ సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ వంటి బలమైన జట్లు ఉండటంతో సెమీఫైనల్కు చేరేందుకు తీవ్ర పోటీ నెలకొననుంది.
మరిన్నివార్తలుచదవండి: భారత జట్టు కోచ్ పదవిపై గిల్లెస్పీ స్పష్టత: నో థాంక్స్ అన్న మాజీ ఆస్ట్రేలియా స్టార్
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్ మరియు శ్రీలంకలో జరుగుతుంది.
భారత్ పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుంది.
I am Krishna, a passionate Telugu cricket writer with over two years of experience in cricket coverage. With a deep love for the game, I focus on delivering sharp match analysis and insightful player stories in a clear, engaging style that connects strongly with Telugu readers.